మొదటి నుంచి విభిన్న కథలను ఎంచుకుంటూ వరుస విజయాలు సొంతం చేసుకుంటోన్న యువ నటుడు అడివి శేషు మరో థ్రిల్లర్ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కొత్త దర్శకుడు వెంకట్ రామ్ జీ దర్శకత్వంలో అడివి శేషు నటిస్తుండగా.. ఆ చిత్రానికి ‘ఎవరు’ అనే టైటిల్ను ఖరారు చేశారు. దీనికి సంబంధించిన ఫస్ట్లుక్ను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇక ఇందులో అడివి శేషు సరసన రెజీనా నటిస్తుండగా.. నవీన్ కృష్ణ, మురళీ శర్మ కీలకపాత్రలలో కనిపించనున్నారు. పీవీపీ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు. ఆగష్టు 23న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ చిత్రంతో పాటు అడివి శేషు ప్రస్తుతం గూఢచారి 2, మేజర్ చిత్రాల్లో నటిస్తోన్న విషయం తెలిసిందే.
After Goodachari, Happy to announce my next #EVARU ! Shot in secret to preserve the twists ? @reginacassandra @Naveenc212 @murlisharma72 Dialogues by my guru @abburiravi garu #Sricharan @Garrybh88 @Vamsi_P1988
Directed by talented Venkat Ramji. Releases August 23! #EvaruOnAug23 pic.twitter.com/QJDly9rPuw— Adivi Sesh (@AdiviSesh) June 3, 2019