డ్రగ్స్ కేస్ : జైల్లో తీవ్ర అనారోగ్యానికి గురైన ఆ హీరోయిన్.. ఆసుపత్రికి తరలింపు..

|

Dec 24, 2020 | 6:47 PM

యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత బయటపడిన డ్రగ్స్ వ్యవహారం మొత్తం సినిమా ఇండస్ట్రీనే కుదిపేసింది.

డ్రగ్స్ కేస్ : జైల్లో తీవ్ర అనారోగ్యానికి గురైన ఆ హీరోయిన్.. ఆసుపత్రికి తరలింపు..
Follow us on

యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత బయటపడిన డ్రగ్స్ వ్యవహారం మొత్తం సినిమా ఇండస్ట్రీనే కుదిపేసింది. ఈ క్రమంలో శాండిల్ వుడ్ హీరోయిన్స్ రాగిణి ద్వివేది, సంజనలను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెల్సిందే. బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో విచారణ ఖైదీగా ఉన్న రాగిణి ద్వివేది తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆమెను వెంటనే ఓప్రైవేట్ ఆసుపత్రికి  తరలించారు. ఊపిరి ఆడక ఇబ్బంది పడుతున్న ఆమెకు తీవ్రమైన బ్యాక్ పెయిన్ కూడా రావడంతో  సెంట్రల్ జైలులోని ఆసుపత్రిలో రాగిణికి చికిత్స అందించారు. అనంతరం ఆమెను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

గతంలో చాలాసార్లు రాగిణి బెయిల్ కోసం అభ్యర్ధించింది అయినా కూడా న్యాయస్థానం అంగీకరించలేదు. బెయిల్ క్యాన్సిల్ అవ్వడంతో రాగిణి ద్వివేది నిరంతర ఆందోళన చెందుతూ అనారోగ్యం బారిన పడ్డారని ఆమె ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందడానికి అవకాశం ఇవ్వాలని ఆమె తరపు న్యాయవాదులు ఇంతకు ముందే కోర్టును కోరారు. కానీ న్యాయస్థానం అందుకు కూడా అంగీకరించలేదు. ఇప్పుడు రాగిణికి బెయిల్ ఇస్తారా లేదా ? అన్నది వైద్యులు ఇచ్చే నివేదిక మీదనే ఆధారపడి ఉంటుంది.