Visakhapatnam: బెట్టింగ్ పేరుతో యువతులకు వల.. కేటుగాళ్లను అరెస్ట్ చేసిన పోలీసులు..
తక్కువ టైమ్లో ఎక్కువ డబ్బు సంపాదన. అది కూడా ఈజీ మనీయే టార్గెట్. పెద్దగా కష్టపడకుండానే లక్షలకు లక్షలు, కోట్లకు కోట్లు కొల్లగొట్టేయాలన్నదే కేటుగాళ్ల లక్ష్యం.
Visakhapatnam: తక్కువ టైమ్లో ఎక్కువ డబ్బు సంపాదన. అది కూడా ఈజీ మనీయే టార్గెట్. పెద్దగా కష్టపడకుండానే లక్షలకు లక్షలు, కోట్లకు కోట్లు కొల్లగొట్టేయాలన్నదే కేటుగాళ్ల లక్ష్యం. అందుకోసం ఎంతకైనా తెగిస్తున్నాయి ముఠాలు. అలాంటి ముఠా ఒకదానికి చెక్ పెట్టారు విశాఖ పోలీసులు. ఆన్లైన్లో రమ్మీ, క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ యువకులకు గాలం వేస్తోన్న కేటుగాళ్లను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు కిశోర్ సహా 9మంది నిందితులను పట్టుకున్నట్లు వెల్లడించారు పోలీసులు. ఈ ముఠా దగ్గర్నుంచి నాలుగు ల్యాప్ టాప్స్, 17 ఖరీదైన మొబైల్స్, వైఫై రూటర్స్, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్, ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నారు
ఈ ముఠాలోని ప్రధాన నిందితులంతా ఛత్తీస్గఢ్ వాసులేనన్నారు విశాఖ సీపీ. అయితే, స్థానికులతో కలిసి దందా నడుపుతున్నట్లు వెల్లడించారు. ఆన్లైన్లో రమ్మీ, క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ అమాయక యువతకు గాలమేస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి ముఠాల చేతుల్లోపడి మోసపోవద్దని యువతకు సూచించారు పోలీసులు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి