Uttar Pradesh Accident : వెదర్ ఎఫెక్ట్.. యూపీ ఘోర రోడ్డు ప్రమాదం.. లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌ వేపై ట్రక్కును ఢీకొన్న కారు..

|

Feb 13, 2021 | 10:42 AM

యూపీ కన్నౌజ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ట్రక్కును ఢీకొట్టింది కారు. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. చనిపోయిన వాళ్లంతా టీనేజర్సే. అంతా యువతే కావడంతో వారి కుటుంబాలు..

Uttar Pradesh Accident : వెదర్ ఎఫెక్ట్.. యూపీ ఘోర రోడ్డు ప్రమాదం.. లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌ వేపై ట్రక్కును ఢీకొన్న కారు..
Uttar Pradesh Accident
Follow us on

Uttar Pradesh Accident : ఏపీలోనే కాదు.. ఉత్తరప్రదేశ్‌లోనూ ఇవాళ రోడ్లు రక్తసిక్తమయ్యాయి. వరుస ప్రమాదాలు జరిగాయి. వారణాసి, కన్నౌజ్‌, యమునా ఎక్స్‌ప్రెస్‌వే ఇలా పలు ప్రాంతాలు మృత్యు కుహరాలుగా మారాయి.

యూపీ కన్నౌజ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ట్రక్కును ఢీకొట్టింది కారు. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. చనిపోయిన వాళ్లంతా టీనేజర్సే. అంతా యువతే కావడంతో వారి కుటుంబాలు తీరని విషాదంలో మునిగిపోయాయి.

ఇక వారణాసిలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. యాత్రికులతో ఉన్న బస్సు రైల్వే ఓవర్‌ బ్రిడ్జి రెయిలింగ్‌ను ఢీకొని గాల్లో తేలింది. ఐతే ఆ బస్సు కిందకు పడలేదు. దీంతో ప్రయాణికులంతా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బస్సులో ఉన్న 35 మంది ప్రయాణికులు పెద్దగా కేకలు వేయడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు..బస్సు అద్దాలు పగులగొట్టి యాత్రికులను కాపాడారు.

ఇక ఇటు నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై 6 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దట్టమైన పొగమంచుకు దారి కనిపించక ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 12మందికి గాయాలయ్యాయి. వారిని హస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

AP Panchayat Elections 2021 live : ఏపీ పల్లె పోరు.. రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. రెండు గంటల్లో 10.28 శాతం నమోదు

Regional Ring Road: తెలంగాణకు కేంద్ర ప్రభుత్వ గుడ్‌న్యూస్‌.. రాష్ట్రంలో రీజినల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణానికి ఆమోదం