కోర్టు ప్రాంగణంలోనే బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ హత్య..

|

Jun 12, 2019 | 7:41 PM

ఉత్తరప్రదేశ్ బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దర్వేష్ సింగ్ హత్యకు గురయ్యారు. కోర్టు ప్రాంగణంలోనే మనీష్ శర్మ అనే ఓ న్యాయవాది ఆమెను హత్య చేశాడు. ఆ తర్వాత ఆ లాయర్ ఆత్మహత్య చేసుకున్నాడు. రెండు రోజుల క్రితమే దర్వేష్ సింగ్ బార్ కౌన్సిల్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో సిటీ సివిల్ కోర్టుకు వచ్చారు. ఈ క్రమంలో మధ్యాహ్నం 2.30 గంటలకు కోర్టు ప్రాంగణంలోనే దర్వేష్ సింగ్‌ను మనీష్ శర్మ గన్‌తో కాల్చి చంపారు. కాగా ఆవిడ […]

కోర్టు ప్రాంగణంలోనే బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ హత్య..
Follow us on

ఉత్తరప్రదేశ్ బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దర్వేష్ సింగ్ హత్యకు గురయ్యారు. కోర్టు ప్రాంగణంలోనే మనీష్ శర్మ అనే ఓ న్యాయవాది ఆమెను హత్య చేశాడు. ఆ తర్వాత ఆ లాయర్ ఆత్మహత్య చేసుకున్నాడు. రెండు రోజుల క్రితమే దర్వేష్ సింగ్ బార్ కౌన్సిల్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో సిటీ సివిల్ కోర్టుకు వచ్చారు. ఈ క్రమంలో మధ్యాహ్నం 2.30 గంటలకు కోర్టు ప్రాంగణంలోనే దర్వేష్ సింగ్‌ను మనీష్ శర్మ గన్‌తో కాల్చి చంపారు. కాగా ఆవిడ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. వారిద్దరి మధ్య చాలా కాలం నుంచి వైరం ఉన్నట్టు ఆగ్రా అడిషనల్ ఎస్పీ ప్రవీణ్ వర్మ తెలిపారు. దర్వేష్ సింగ్‌కు మూడు బుల్లెట్లు దిగాయి. అనంతరం మనీష్ శర్మ కూడా తనను తాను కాల్చుకున్నాడు. తన లైసెన్స్ గన్‌తోనే ఆమె మీద కాల్పులు జరిపాడు. కోర్టు ప్రాంగణంలో దర్వేష్ సింగ్‌కు సన్మాన కార్యక్రమం జరుగుతున్న సమయంలో సడన్‌గా మనీష్ శర్మ కాల్పులు జరిపినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.