AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నీటి సంపులో పడి మూడేళ్ల చిన్నారి మృతి

రంగారెడ్డి జిల్లా లోని శంషాబాద్ లో చోటుచేసుకొంది. హుడా కాలనీలో ప్రమాద వశాత్తు నీటి సంపులో పడి మూడేళ్ల చిన్నారి మృతి చెందింది.

నీటి సంపులో పడి మూడేళ్ల చిన్నారి మృతి
Balaraju Goud
|

Updated on: Jul 03, 2020 | 9:59 PM

Share

రంగారెడ్డి జిల్లా లోని శంషాబాద్ లో చోటుచేసుకొంది. హుడా కాలనీలో ప్రమాద వశాత్తు నీటి సంపులో పడి మూడేళ్ల చిన్నారి మృతి చెందింది. హుడా కాలనీకి చెందిన లక్ష్మీ, శేఖర్ దంపతులకు కవల పిల్లలు తేజశ్రీ, నిత్యశ్రీ (3) అనే ఇద్దరు కూతుళ్లు. దంపతలు ఇద్దరూ కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం పనులు పూర్తి చేసుకుని ఇంటికి చేరిన వారికి ఛేదు వార్త ఎదురైంది.

సాయంత్రం సమయంలో ఇంటి బయట ఆడుకుంటున్న నిత్యశ్రీ ప్రమాదవశాత్తు నీటి సంపులో పడిపోయింది. ఇది గమనించిన స్థానికులు పాపను బయటకు తీసినప్పటికీ అప్పటికే ఆలస్యం కావడంతో పాప మృతి చెందింది. సాయంత్రం ప‌ని ముగించుకొని ఇంటికి చేరిన పాప తల్లిదండ్రులు త‌మ బిడ్డ ఇక లేద‌ని తెలిసి ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. స్థానికుల సమాచారం మేరుకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.