Ganesh Immersion: గణేశ్ నిమజ్జనోత్సవంలో అపశృతి.. సముద్రంలో ముగ్గురు యువకులు గల్లంతు..

|

Sep 20, 2021 | 11:25 AM

Three boys drowned at Versova beach: గణేశ్ నిమజ్జనోత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. గణేశ్ నిమజ్జనం కోసం సముద్రతీరానికి వెళ్లి ఐదుగురు యువకులు గల్లంతయ్యారు. ఈ విషాద ఘటన

Ganesh Immersion: గణేశ్ నిమజ్జనోత్సవంలో అపశృతి.. సముద్రంలో ముగ్గురు యువకులు గల్లంతు..
Ganesh Immersion
Follow us on

Three boys drowned at Versova beach: గణేశ్ నిమజ్జనోత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. గణేశ్ నిమజ్జనం కోసం సముద్రతీరానికి వెళ్లి ఐదుగురు యువకులు గల్లంతయ్యారు. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని ముంబై నగరం జరిగింది. ముంబైలోని వెర్సోవా సముద్రతీరంలో వినాయక నిమజ్జనం సందర్భంగా ఐదుగురు బాలురు నీటిలో మునిగినట్లు అధికారులు తెలిపారు. సముద్రంలో మునిగిన వారిలో ఇద్దరిని కాపాడినట్లు వెల్లడించారు. అనుమతి లేని ప్రదేశానికి ఆ బాలురు నిమజ్జనం కోసం వెళ్లారని.. ఈ క్రమంలో అలల ధాటికి ఐదుగురు నీటిలో మునిగిపోయినట్లు తెలిపారు. గమనించిన స్థానికులు ఇద్దరిని కాపాడినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం వారిని కూపర్ ఆసుపత్రికి తరలించారు. సముద్రంలో నిమజ్జనం సందర్భంగా గల్లంతైన ముగ్గురు బాలుర కోసం ముంబై అధికారులు గాలిస్తున్నారు. గల్లంతైన బాలుర కోసం గాలించేందుకు పోలీసు బోటుతోపాటు నేవి సిబ్బందిని కూడా రంగంలోకి దించామని ముంబై చీఫ్ ఫైర్ ఆఫీసర్ తెలిపారు.

Also Read:

Punjab CM: గురుద్వారాలో ప్రత్యేక పూజలు.. పంజాబ్ కొత్త సీఎంగా చరణ్‌జీత్‌ సింగ్‌ కాసేపట్లో ప్రమాణ స్వీకారం

Sea cucumber: రూ.8 కోట్ల విలువైన సముద్ర జీవులు స్వాధీనం.. అక్రమంగా శ్రీలంకకు తరలిస్తుండగా..