Hyderabad : గుండ్లపోచంపల్లిలో దొంగల బీభత్సం.. గ్యాంగ్ అంతా దిగిపోయింది

|

Aug 01, 2021 | 11:44 AM

హైదరాబాద్‌ శివారులో దొంగలు రెచ్చిపోయారు. గుండ్లపోచంపల్లిలో బీభత్సం సృష్టించారు. జై భవాని కిరణాషాపులో అర్ధరాత్రి చోరీకి పాల్పడ్డారు.

Hyderabad : గుండ్లపోచంపల్లిలో దొంగల బీభత్సం.. గ్యాంగ్ అంతా దిగిపోయింది
Hyderabad Thives
Follow us on

హైదరాబాద్‌ శివారులో దొంగలు రెచ్చిపోయారు. గుండ్లపోచంపల్లిలో బీభత్సం సృష్టించారు. జై భవాని కిరణాషాపులో అర్ధరాత్రి చోరీకి పాల్పడ్డారు. షట్టర్‌ పగులగొట్టి కిరాణషాపులో చోరీ చేశారు. ఇద్దరు దొంగలు షట్టర్ పగులగొడితే..మరొకరు పక్కనే కాపలా ఉన్నారు. మొత్తం నలుగురు సభ్యుల ముఠా ఈ చోరీలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి రెండున్నర గంటలకు ఈ చోరీ జరిగింది. కిరాణాషాపులో చోరీ తర్వాత పక్కనే ఉన్న శ్రీమాత జ్యూయలరీ షాపులో దొంగతనానికి విఫలయత్నం చేశారు. కిరాణా షాపులో సుమారు 35వేల నగదు, 30 తులాల వెండి అపహరించినట్లు తెలుస్తోంది.

 

దొంగ సొమ్ము పంపకాల్లో వివాదం.. ఒకరి హత్య

గుంటూరు జిల్లాలో దొంగలముఠాలో ఏర్పడిన వివాదం ఒకరి హత్యకు దారితీసింది. కర్లపాలెం మండలం సత్యవతి పేటకు చెందిన సాగర్ రెడ్డిని శనివారం సాయంత్రం కొందరు కత్తులతో పొడిచి చంపారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని డెడ్‌బాడీని ఆసుపత్రికి తరలించారు. అతని స్నేహితులే సాగర్ రెడ్డిని చంపినట్లు పోలీసులు వెల్లడించారు. సాగర్ రెడ్డి దొంగతనాలు, గంజాయి రవాణాతో పాటు నేరాలకు పాల్పడుతుంటాడు. అతనిపై గుంటూరు జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులున్నాయి. దొంగసొత్తు పంపకాల్లో అదే గ్యాంగ్‌లోని బడేసాబ్ అనే వ్యక్తితో సాగర్ రెడ్డికి విభేదాలు వచ్చాయి. దీంతో బడేసాబ్ మరికొందరితో కలిసి సాగర్​ను హత్యచేసినట్లు పోలీసులు తేల్చారు. మొత్తం 8మంది ఈ హత్యలో పాల్గొన్నట్లు తెలిపారు.

Also Read:  అల్లుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న అత్త.. భర్త అడ్డుగా ఉన్నాడని.. చిత్తూరులో దారుణం.

ఉద్యోగాల పేరుతో కిలాడీ చీటింగ్‌.. కోట్లు కొట్టేసి జంప్ అయ్యేందుకు ప్లాన్‌.. కానీ అక్కడే దొరికింది