Andhra Pradesh: విజయనగరం జిల్లాలో దారుణం.. యువతిపై పెట్రోల్ పోసి నిప్పటించిన యువకుడు..

|

Aug 20, 2021 | 10:49 AM

Andhra Pradesh: విజయనగరం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని పూసపాటిరేగ మండలం చౌడవాడలో యువతిపై పెట్రోల్ నిప్పటించాడు ఓయువకుడు.

Andhra Pradesh: విజయనగరం జిల్లాలో దారుణం.. యువతిపై పెట్రోల్ పోసి నిప్పటించిన యువకుడు..
Fire Accident
Follow us on

Andhra Pradesh: విజయనగరం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని పూసపాటిరేగ మండలం చౌడవాడలో యువతిపై పెట్రోల్ నిప్పటించాడు ఓయువకుడు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన యువతి అక్క, అక్క కుమారుడికి కూడా గాయాలు అయ్యాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యువతి పరిస్థితి విషమంగా ఉంది. యువతిని స్థానిక ఆస్పత్రిలో చేర్పించగా.. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా, యువతి అక్క, అక్క కుమారుడినని కూడా ఆస్పత్రిలో చేర్పించారు. వారిని జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నుమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Also read:

SBI: ఎస్‌బీఐ తన వినియోగదారులకు హెచ్చరిక.. వీలైనంత త్వరగా ఈ పనిని పూర్తి చేసుకోండి.. లేకపోతే ఇబ్బందే..!

Varalakshmi Vratam: శుక్రవారం లక్ష్మీదేవిని ఈ స్త్రోత్రంతో స్తుతిస్తే.. దారిద్య బాధల తీరి సుఖసంతోషాలతో ఉంటారట

Radhe Shyam: రాధేశ్యామ్ నుంచి ఇంట్రెస్టింగ్ అప్‏డేట్.. అందుకే  ఆ స్పెషల్ షూట్ చేస్తున్నారా ?