Rajahmundry : తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గోదావరి తీరానికి కొట్టుకు వచ్చిన ఇద్దరు యువతుల మృతదేహాలు.. !

రాజమహేంద్రవరం నగరంలో ఇద్దరు యువతుల మృతదేహాలు కలకలం రేపుతున్నాయి..

Rajahmundry : తూర్పు గోదావరి జిల్లా  రాజమహేంద్రవరంలో గోదావరి తీరానికి కొట్టుకు వచ్చిన ఇద్దరు యువతుల మృతదేహాలు.. !
Rajahmundary Godavari

Updated on: Jun 02, 2021 | 7:35 AM

Bodies of two young women washed up : తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరంలో ఇద్దరు యువతుల మృతదేహాలు కలకలం రేపుతున్నాయి. రాజమండ్రిలోని గోదావరి తీరాన ఉన్న ఒక ఇసుక ర్యాంప్‌ సమీపంలో ఈ ఉదయం ఇద్దరు యువతుల మృతదేహాలు కనిపించాయి. ఇవి ఎగువ ప్రాంతం నుంచి కొట్టుకు వచ్చినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. యువతుల వయస్సు 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉంటుందని తెలిపారు. కాగా ఇద్దరు యువతుల మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారు ఆత్మహత్యకు పాల్పడ్డారా? లేక ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయి కొట్టుకు వచ్చారా? మరే ఇతర కారణాలతోనైనా మరణించారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Read also : Amazon Prime : యువ కస్టమర్లకు అమెజాన్ బంపరాఫర్.. ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ మీద 50 శాతం క్యాష్ బ్యాక్. !