Family Suicide: తమిళనాడులో తీవ్ర విషాదం.. భర్త మరణాన్ని తట్టుకోలేక.. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి భార్య ఆత్మహత్య

కరోనా మహమ్మారి ఓ కుటుంబాన్నే మింగేసింది. వైరస్ సోకి భర్త మరణించడాన్ని జీర్ణించుకోలేని భార్య, తన ఇద్దరు పిల్లలను హతమార్చి తానూ బలవన్మరణానికి పాల్పడింది.

Family Suicide: తమిళనాడులో తీవ్ర విషాదం.. భర్త మరణాన్ని తట్టుకోలేక.. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి భార్య ఆత్మహత్య
girl gets father killed

Updated on: Jun 26, 2021 | 9:40 AM

Woman kills children, self after husband dies: కరోనా మహమ్మారి ఓ కుటుంబాన్నే మింగేసింది. వైరస్ సోకి భర్త మరణించడాన్ని జీర్ణించుకోలేని భార్య, తన ఇద్దరు పిల్లలను హతమార్చి తానూ బలవన్మరణానికి పాల్పడింది. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఈ విషాద ఘటన వివరాలు పోలీసుల కథనం మేరకు.. మాంగాడుకు చెందిన భాస్కర్‌, నిత్య దంపతుల కాపురం ప్రశాంతంగా సాగుతుంది. వీరికి కుమార్తె మహతి (11), కుమారుడు యాదవకృష్ణన్‌ (6) ఉన్నారు. వీరి పచ్చని సంసారంలో కరోనా మహమ్మారి చిచ్చుపెట్టింది. కాగా, గత నెల 2వ తేదీన భాస్కర్‌కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో, నగరంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి వైద్యం చేయించారు కుటుంబసభ్యులు. అయితే, చికిత్స పొందుతూ 9వ తేదీన భాస్కర్ మృతిచెందాడు.

దీంతో భర్త మరణంతో శోకసముద్రంలో మునిగిన నిత్య తన ఇద్దరు పిల్లలను వెంటబెట్టుకొని ఈరోడ్‌లో ఉన్న తన పుట్టింటికి వెళ్లింది. భర్త మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన నిత్య గురువారం మధ్యాహ్న భోజనంలో విషం కలిపి తన పిల్లలకు తినిపించి, తన గదిలోకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై ఆమె తండ్రి పార్థసారధి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించి దర్యాప్తు ప్రారంభించారు.

Read Also… A Man Brutally Murdered: అనంతపురం శివారులో ఓ వ్యక్తి దారుణ హత్య.. బండరాళ్లతో మోది చంపిన గుర్తు తెలియని దుండగులు