China Sichuan Province : మూడు వేల క్రితం నాటి బంగారు వస్తువులు, కళాఖండాలు వెలుగులోకి.. వీటి విలువ తెలిస్తే షాక్ కావాల్సిందే..

China Sichuan Province : చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లోని ఓ ప్రాచీన ప్రదేశంలో 3,000 సంవత్సరాల పురాతన కళాఖండాలు, బంగారు వస్తువలు లభ్యమయ్యాయి.

China Sichuan Province : మూడు వేల క్రితం నాటి బంగారు వస్తువులు, కళాఖండాలు వెలుగులోకి.. వీటి విలువ తెలిస్తే షాక్ కావాల్సిందే..
China Sichuan Province

Edited By: Ravi Kiran

Updated on: Mar 23, 2021 | 10:00 AM

China Sichuan Province : చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లోని ఓ ప్రాచీన ప్రదేశంలో 3,000 సంవత్సరాల పురాతన కళాఖండాలు, బంగారు వస్తువలు లభ్యమయ్యాయి. ప్రావిన్షియల్ రాజధాని చెంగ్డు వెలుపల 4.6 చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉన్న సాన్సింగ్‌డై వద్ద ఈ అన్వేషణలు జరిగాయి. క్రీస్తుపూర్వం 316 లో పశ్చిమ సిచువాన్ బేసిన్లో పాలించిన కాలానివిగా కొందరు నిపుణులు చెబుతున్నారు. ఆ దేశ పురావస్తు అధికారుల ప్రకారం.. బంగారు మాస్కులు, కాంస్య విగ్రహాలు, బంగారు రేకులు, దంతాలు, ఎముకలతో తయారు చేసిన కళాఖండాలను కనుగొన్నారు. వీటిలో ఒకటి 19 చదరపు మీటర్లు పాదముద్రను కలిగి ఉంది, ఇంకా తెరవని ఒక చెక్క పెట్టెను, గుడ్లగూబ ఆకారంలో ఉన్న కాంస్య పాత్రను కూడా గుర్తించారు.

1920 లో సాన్సింగ్‌డూయి వద్ద 50,000 కి పైగా పురాతన కళాఖండాలు బయటపడ్డాయి. స్థానిక రైతు అనుకోకుండా వాటిని గుర్తించాడు. ఇక కాంస్య వస్తువులకు సంబంధించి 1986 లో రెండు ఉత్సవ గుంటలను కనుగొన్నారు. సుదీర్ఘ విరామం తరువాత మూడో గొయ్యి 2019 చివరలో కనుగొనబడింది, నిపుణులు ఈ గుంటలను బలి ప్రయోజనాల కోసం ఉపయోగించారని నమ్ముతారు, అందులో ఉన్న అనేక వస్తువులను ఆచారంగా కాల్చివేసి వాటిని ఖననం చేసినట్లుగా చెబుతున్నారు. అవి ఇప్పుడు ఆన్-సైట్ మ్యూజియంలో ప్రదర్శించబడుతున్నాయి. పురాతన చైనాలో నాగరికత ఎలా అభివృద్ధి చెందిందనే దానిపై నిపుణుల అవగాహనను సైట్ విప్లవాత్మకంగా మార్చింది.

నేషనల్ కల్చరల్ హెరిటేజ్ అడ్మినిస్ట్రేషన్ డిప్యూటీ డైరెక్టర్, సాంగ్ జిన్చావో మాట్లాడుతూ.. తాజాగా బయటపడిన వస్తువులు “సాన్సింగ్‌డూయి సంస్కృతి గురించి మనకు తెలియజేస్తున్నాయన్నారు. సిచువాన్ ప్రావిన్షియల్ కల్చరల్ రెలిక్స్ అండ్ ఆర్కియాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చీఫ్ టాంగ్ ఫే మాట్లాడుతూ.. ఈ ఆవిష్కరణ పురాతన చైనాలో మూలాల్లో ఒకటిగా అభివర్ణించారు. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించకపోయినా భవిష్యత్తులో కచ్చితంగా ఈ వరుసలో చేరుతుందన్నారు. అయితే UN ఏజెన్సీ, చైనా, తూర్పు ఆసియా, ప్రపంచ కాంస్య యుగ నాగరికత యొక్క అత్యుత్తమ ప్రతినిధిగా పేర్కొంది.

మహారాష్ట్ర బీజేపీ చీఫ్‌తో సహా 50మందిపై కేసు నమోదు.. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారంటూ ఆరోపణ

Shraddha kapoor: సముద్ర గర్భంలో అందాల తార.. ఆకట్టుకుంటోన్న శ్రద్ధా కపూర్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వీడియో..