Iraq Blast: బాంబులతో దద్దరిల్లుతున్న బాగ్దాద్.. మార్కెట్‌పై దాడి.. 30 మంది దుర్మరణం..

|

Jul 20, 2021 | 9:42 AM

Bomb Attack in Iraq: ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లో బాంబులతో దద్దరిల్లుతోంది. నిత్యం జరుగుతున్న మారణహోమంలో వందలాది మంది మరణిస్తున్నారు. తాజాగా ఓ బాంబు

Iraq Blast: బాంబులతో దద్దరిల్లుతున్న బాగ్దాద్.. మార్కెట్‌పై దాడి.. 30 మంది దుర్మరణం..
Bomb Attack In Baghdad
Follow us on

Bomb Attack in Iraq: ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లో బాంబులతో దద్దరిల్లుతోంది. నిత్యం జరుగుతున్న మారణహోమంలో వందలాది మంది మరణిస్తున్నారు. తాజాగా ఓ బాంబు దాడిలో 30 మంది మరణించారు. ఈ దాడి సంఘటన సదర్ నగరంలోని వహైలాట్ మార్కెట్లో జరిగిందని ఇరాక్ సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పేలుడు 30 మంది మరణించారని.. ఇంకా చాలామంది తీవ్రంగా గాయపడ్డారని ఇరాక్ సైన్యం వెల్లడించింది. బుధవారం ఈద్‌ అల్‌-అదా (బక్రిద్) పర్వదినం కావడంతో మార్కెట్‌ ఏరియాలో భారీ ఎత్తున జనం ఉన్నారని.. ఈ సమయంలో దుండగులు బాంబును పేల్చినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో పదుల సంఖ్యలో బాధితులు గాయపడ్డారని పేర్కొన్నారు. పేలుడు తరువాత ఈ ప్రాంతంలో భయాందోళన పరిస్థితులు నెలకొన్నట్లు భద్రతా అధికారులు తెలిపారు.

కాగా.. గతేడాది సెంట్రల్ బాగ్దాద్‌లో జరిగిన జంట ఆత్మాహుతి బాంబు దాడుల్లో 30 మందికి పైగా మరణించారు. అయితే.. మూడేళ్ల తర్వాత ఇలాంటి ఘోరమైన బాంబు దాడి జరిగినట్లు భద్రతా బలగాలు పేర్కొన్నాయి.

Also Read:

Andhra Pradesh: సముద్రంలో 12 మంది మత్స్యకారులు గల్లంతు.. కాపాడాలంటూ బాధిత కుటుంబాల విజ్ఞప్తి..

NIA Raids: తెలంగాణలో ఎన్‌ఐఏ కలకలం.. 5 జిల్లాల్లో ఏకకాలంలో సోదాలు… భారీగా పేలుడు పదార్థాల స్వాధీనం!

Heroin seizes: సౌదీ టు హైదరాబాద్ వయా జాంబియా.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో పట్టుబడిన 21 కోట్ల రూపాయల విలువైన హెరాయిన్‌