మహబూబాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎమ్మెల్యే కాన్వాయ్లో ప్రమాదం చోటు చేసుకుంది.
జిల్లాలోని బయ్యారం మండలం మిర్యాలపెంట వద్ద ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. కాన్వాయ్ ముందు బైక్ పై వెళ్తున్న సీఐ, కానిస్టేబుల్ ను ఎదురుగా వస్తున్న కారు బలంగా డీకొట్టింది. ఈ ప్రమాదంలో బయ్యారం సిఐ రమేష్, కానిస్టేబుల్ రామకృష్ణ కు తీవ్రగాయాలయ్యాయి. సిబ్బంది వెంటనే స్పందించి వారిని ఇల్లందు ఏరియా ఆస్పత్రి కి తరలించారు. ఘటనపై ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.