ఎయిమ్స్ మెడికల్ విద్యార్థి ఆత్మహత్య

|

Aug 11, 2020 | 12:53 PM

దేశ రాజ‌ధాని ఢిల్లీలో విషాదం చోటుచేసుకుంది. ఎయిమ్స్ హాస్ట‌ల్ భ‌వ‌నంపై నుంచి దూకి 22 ఏళ్ల మెడిక‌ల్‌ విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు.

ఎయిమ్స్ మెడికల్ విద్యార్థి ఆత్మహత్య
Follow us on

దేశ రాజ‌ధాని ఢిల్లీలో విషాదం చోటుచేసుకుంది. ఎయిమ్స్ హాస్ట‌ల్ భ‌వ‌నంపై నుంచి దూకి 22 ఏళ్ల మెడిక‌ల్‌ విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. కర్నాటకు చెందిన విద్యార్థి ఎయిమ్స్ మెడికల్ విద్యను అభ్యసిస్తున్నాడు. 2018 బ్యాచ్‌కు చెందిన‌ విద్యార్థి సోమ‌వారం సాయంత్రం హాస్ట‌ల్ భ‌వ‌నం ప‌క్క‌న తీవ్ర గాయాల‌తో ప‌డి ఉండటాన్ని తోటి విద్యార్థులు గ‌మ‌నించారు. దీంతో వెంట‌నే అతన్ని ఎయిమ్స్‌లోని ట్రామా సెంట‌ర్‌లో చేర్చ‌ించారు. అస్పత్రిలో చికిత్స పొందుతూ విద్యార్థి మృతిచెందాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విద్యార్ధి ఆత్మ‌హ‌త్య‌కుగ‌ల కార‌ణాలపై ఆరా తీస్తున్నారు.

అయితే, ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన విద్యార్థి గ‌త కొంత కాలంగా మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో బాధ‌పడుతున్నట్లు తోటి విద్యార్థులు చెబుతున్నారు. ఇందుకోసం కొంతకాలంగా ఎయిమ్స్‌లోని సైకియాట్రీ విభాగంలో చికిత్స చేయించుకునేవాడ‌ని పోలీసులు వెల్ల‌డించారు. త‌దుప‌రి ద‌ర్యాప్తు కొన‌సాగుతున్న‌దని చెప్పారు.