Telangana Crime News: లావుగా ఉన్నావని.. సన్నబడాలని భర్త వేధింపులు.. వివాహిత ఆత్మహత్య

|

Mar 10, 2021 | 7:12 PM

దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పరిధిలో గృహిణి అనుమానస్పద మరణం కలకలం రేపుతోంది. అల్లుడి వేధింపులు వల్లే తమ కుమార్తె చనిపోయిందని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 

Telangana Crime News: లావుగా ఉన్నావని.. సన్నబడాలని భర్త వేధింపులు.. వివాహిత ఆత్మహత్య
సన్నబడాలని వేధించటంతో వివాహిత ఆత్మహత్య..
Follow us on

దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పరిధిలో గృహిణి అనుమానస్పద మరణం కలకలం రేపుతోంది. అల్లుడి వేధింపులు వల్లే తమ కుమార్తె చనిపోయిందని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. చనిపోయిన మహిళ భర్త శివకుమార్ సనత్ నగర్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఎనిమిదేళ్ల క్రితం శ్రీలత(28)తో శివకుమార్ వివాహం జరిగింది. పెళ్లైన రెండేళ్లకు అదనపు కట్నం తేవాలని ఆమెను భర్త వేధింపులకు గురిచేశాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆ సమయంలో బిడ్డ జీవితం బాగుండాలని కొంత డబ్బును ఇచ్చామని.. మళ్లీ  ఇద్దరు ఆడపిల్లలు పుట్టాక వేధింపులు ఎక్కువ చేశాడని చెబుతున్నారు. నిత్యం తమ కుమార్తెను ఏదో రకంగా వేధిస్తూనే ఉన్నాడని పేర్కొన్నారు.

పెళ్లై ఇద్దరు పిల్లలున్న శ్రీలత లావుగా ఉందని, తరచు మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని, ఇటీవల భర్తలో జరిగిన గొడవ కారణంగా తమ కుమార్తె మనస్థాపం చెంది పోచంపల్లి చెరువులో దూకి  ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు చెబుతున్నారు.  కేసు నమోదు చేసుకున్న దుండిగల్ పోలీసులు.. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన అనంతరం మృతిపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

కాగా నలుగురికి మంచి చెప్పాల్సిన బాధ్యతగల ఉద్యోగంలో ఉండి శివ కుమార్  ఈ రకంగా వ్యవహరించడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదనపు కట్నంతో పాటు లావుగా ఉందని ఆమెను వేధించడం దారుణం అని చెబుతున్నారు. పోలీసులు అతడిపై కేసులు నమోదు చేసి.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Also Read:

ఏపీ మున్సిపల్ ఎన్నికల వేళ సడెన్‌గా మెరిసిన లగడపాటి రాజగోపాల్.. ప్రజల నాడి ఎలా ఉందని అడిగితే..?

ఆటోతో ఢీకొట్టాడు.. స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లమని చెబితే డ్రైవర్ కిరాతకం..