సచివాలయ నిర్మాణ క్రమంలో ప్రమాదం.. విద్యుత్ షాక్ తో ట్రాక్టర్ డ్రైవర్ మృతి

|

Jan 14, 2021 | 8:08 PM

విద్యుత్ షాక్ తో వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ఈ విషాద ఘటన గుంటూరు జిల్లాలోని వినుకొండ మండలం నరగాయపాలెంలో   చోటుచేసుకుంది.

సచివాలయ నిర్మాణ క్రమంలో ప్రమాదం.. విద్యుత్ షాక్ తో ట్రాక్టర్ డ్రైవర్ మృతి
Electric shock
Follow us on

విద్యుత్ షాక్ తో వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ఈ విషాద ఘటన గుంటూరు జిల్లాలోని వినుకొండ మండలం నరగాయపాలెంలో  చోటుచేసుకుంది. విద్యుత్ షాక్‌తో ట్రాక్టర్ డ్రైవర్ రామాంజనేయులు(45) మృతి చెందాడు. సచివాలయ నిర్మాణ క్రమంలో గ్రావెల్ తోలుతుండగా ఈ ప్రమాదం జరిగింది. రామాంజనేయులు మృతితో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబసభ్యులు  కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Manhandling: గుంటూరులో దారుణం.. సర్టిఫికెట్ల కోసం వెళ్లితే రూమ్‌లో బంధించి కొట్టారు.. కారణమేంటంటే..

Republic Day Sales: గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారీ ఆఫర్లను ప్రకటించిన అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌