Crime News: పోలీస్ స్టేషన్‌లో కొట్టుకున్న న్యాయవాదులు.. నలుగురికి తీవ్ర గాయాలు..

|

Aug 17, 2021 | 10:45 PM

Crime News: నలుగురికి న్యాయం చేసే న్యాయవాదులే ఓ స్థల వివాదంలో పోలీస్ స్టేషన్‌లో ఇష్టారీతిన కొట్టుకున్నారు. ఏం చేయాలో తెలియక పోలీసులు చోద్యం చూశారు. చెన్నైలోని కొట్టుర్పూరం పోలీస్ స్టేషన్‌లో జరిగిన

Crime News: పోలీస్ స్టేషన్‌లో కొట్టుకున్న న్యాయవాదులు.. నలుగురికి తీవ్ర గాయాలు..
Lawyers
Follow us on

Crime News: నలుగురికి న్యాయం చేసే న్యాయవాదులే ఓ స్థల వివాదంలో పోలీస్ స్టేషన్‌లో ఇష్టారీతిన కొట్టుకున్నారు. ఏం చేయాలో తెలియక పోలీసులు చోద్యం చూశారు. చెన్నైలోని కొట్టుర్పూరం పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఈ సంఘటన అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. వివరాల్లోకి వెళితే..హోసింగ్ బోర్డు లో ఉన్న ప్రజలకు వీలుగా రోడ్డుమార్గాన్ని నిర్మించాలని బాలమురుగన్ వర్గం న్యాయవాదులు భావించారు. కానీ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న పద్మనాభం అడ్డుకున్నాడు.

దీంతో ఇరువర్గాల మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో పద్మనాభంపై కేసు నమోదు చేయడానికి బాలమురుగన్‌ వర్గం కొట్టుర్పూరం పోలీస్ స్టేషన్‌కి చేరుకున్నారు. దీంతో అక్కడే ఉన్న పద్మనాభం వర్గం న్యాయవాదులు, బాలమురుగన్‌ వర్గం న్యాయవాదుల మధ్య గొడవ తీవ్రతరం అయింది. పోలీస్ స్టేషన్ లోనే ఒకరిపై దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సీసీ విజువల్స్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నారు.

Afghanistan Crisis: మా 20 సంవత్సరాల పోరాటం ఫలించింది.. విదేశీ శక్తులు తరిమికొట్టాం.. ఫ్యూచర్‌పై తాలిబన్ ప్రతినిధి క్లారిటీ

Prime Minister Modi: ప్రధాని మోదీని కించపరుస్తూ వీడియో.. చెన్నై వ్యక్తిని అరెస్ట్ చేసిన యూపీ పోలీసులు..

TCS: చరిత్ర సృష్టించిన టీసీఎస్..13 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ సాధించిన దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ!

Monsoon Hairfall: వర్షాకాలంలో నిగనిగలాడే ఒత్తైన మీ కురుల సంరక్షణ.. శిరోజాల సౌందర్యానికి కొన్ని చిట్కాలు..