Girl Commits Suicide : ఆన్‌లైన్ క్లాసుల కోసం స్మార్ట్‌ఫోన్ లేదని బాలిక ఆత్మహత్య..! పేదరికంలో తల్లిదండ్రులు

Girl Commits Suicide : కరోనా కాలంలో చదువు మొత్తం ఆన్‌లైన్ అయింది. పిల్లలకు ఆన్‌లైన్ తరగతుల ద్వారా

Girl Commits Suicide : ఆన్‌లైన్ క్లాసుల కోసం స్మార్ట్‌ఫోన్ లేదని బాలిక ఆత్మహత్య..! పేదరికంలో తల్లిదండ్రులు
Girl Commits Suicide

Updated on: Jun 21, 2021 | 9:33 PM

Girl Commits Suicide : కరోనా కాలంలో చదువు మొత్తం ఆన్‌లైన్ అయింది. పిల్లలకు ఆన్‌లైన్ తరగతుల ద్వారా బోధిస్తున్నారు. అయితే భారతదేశంలో ప్రతి ఒక్కరు ఇంటర్నెట్ కనెక్షన్ పొందడానికి, స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లకు కొనడానికి ఆదాయం లేదు. ఫలితంగా చాలా మంది పిల్లలు ఆన్‌లైన్ క్లాసులు వినడంలేదు. మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఆన్‌లైన్ తరగతులకు మొబైల్ ఫోన్ అందుబాటులో లేకపోవడంతో బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. తల్లిదండ్రులకు మొబైల్స్ కొనిచ్చే సామర్థ్యం లేదు. నైగావ్‌లో నివసిస్తున్న బాలిక జూన్ 16 న తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

ఈ కేసు నాందేడ్ జిల్లాలోని నైగావ్ కు చెందినది. బాలిక 11 వ తరగతి చదువుతోందని నైగావ్ పోలీస్ స్టేషన్ పోలీసు అధికారి తెలిపారు. అతని తల్లిదండ్రులు రోజువారీ కూలీ కార్మికులు. ఆమెకు ఆన్‌లైన్ క్లాసులు వినడానికి స్మార్ట్ ఫోన్ అవసరమని అయితే ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్ కొనడానికి తగినంత డబ్బు లేదని పోలీసులు వివరించారు. ఈ కారణంగా అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. బాలిక మృతదేహం నుంచి పోలీసులు సూసైడ్ నోట్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆమె తల్లిదండ్రులు ఆన్‌లైన్ క్లాసులు వినడానికి ఫోన్ లేకపోవడంతో ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. పోలీసులు మృతదేహాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని పోస్టుమార్టం నివేదిక కోసం పంపారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Fast & Furious 9 : విడుదలకు ముందే లీకైన ఫాస్ట్ & ఫ్యూరియస్ 9..! దీని వెనుక ఎవరి హస్తం ఉందో తెలుసా..?

Skin Care : మోచేతులు, మోకాళ్ల దగ్గర నల్లగా ఉందా..! అయితే ఈ 6 మార్గాల ద్వారా వదిలించుకోండి..

Heritage Train : అద్భుత పర్వతాల అందాలను చూడాలని ఉందా..! అయితే సిమ్లా వెళ్లి హెరిటేజ్ రైలు ఎక్కాల్సిందే..

కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ ‘పోరుబాట’……..24 న సోనియా గాంధీ అధ్యక్షతన పార్టీ ప్రధాన కార్యదర్శుల సమావేశం ….