అమానుష ఘటన.. ఆసుపత్రుల నిర్లక్ష్యం.. ఆటోలో మరణించిన నిండు గర్భిణి

| Edited By:

Jun 01, 2020 | 3:27 PM

ఆసుపత్రుల నిర్లక్ష్యం.. ఓ నిండు గర్భిణి ప్రాణాలను తీసుకుంది. వైద్యం మాట అటుంచితే కనీసం ఆమెను చేర్చుకునేందుకు కూడా పలు ఆసుపత్రులు నిరాకరించాయి.

అమానుష ఘటన.. ఆసుపత్రుల నిర్లక్ష్యం.. ఆటోలో మరణించిన నిండు గర్భిణి
Follow us on

ఆసుపత్రుల నిర్లక్ష్యం.. ఓ నిండు గర్భిణి ప్రాణాలను తీసుకుంది. వైద్యం మాట అటుంచితే కనీసం ఆమెను చేర్చుకునేందుకు కూడా పలు ఆసుపత్రులు నిరాకరించాయి. దీంతో పురిటి నొప్పులు భరించలేక ఆటోలో వెళుతూ వెళుతూనే ఆ గర్భిణి కన్నుమూసింది. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని థానేలో చోటు చేసుకుంది. మే 25 అర్ధరాత్రి దాటిన తరువాత జరిగిన ఈ ఘటన అధికారుల దృష్టికి చేరింది. ఈ క్రమంలో ముంబ్రా పోలీసులు తాజాగా మూడు ఆసుపత్రులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. అస్మా మెహందీ అనే 26 ఏళ్ల గర్భిణికి మే 25న పురిటి నొప్పులు ప్రారంభం అయ్యాయి. ఈ క్రమంలో ఆసుపత్రిలో ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అస్మాను చేర్చుకునేందుకు మూడు ఆసుపత్రులు నిరాకరించాయి. మొదట బిలాల్‌ ఆసుపత్రికి వెళ్లగా వారు నిరాకరించడంతో.. ఆ తరువాత అస్మాను తీసుకొని ప్రైమ్‌ క్రిటీ కేర్, యూనివర్సల్ ఆసుపత్రులకు తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. అయితే ఆ మూడు ఆసుపత్రులు గర్భిణిని చేర్చుకునేందుకు నిరాకరించాయి. దీంతో నాలుగో ఆసుపత్రికి వెళ్లే క్రమంలో నొప్పులు భరించలేకపోయిన అస్మా ఆటోలోనే కన్నుమూసింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన ముంబ్రా పోలీసులు ఆ మూడు ఆసుపత్రులపై కేసు నమోదు చేశారు. దీనిపై స్పందించిన బీజేపీ నేత రామ్ కదమ్ ఈ ఘటన తనను షాక్‌కి గురి చేసిందని అన్నారు.

Read This Story Also: క్యాన్సర్‌తో బాధపడుతున్న మాజీ బాక్సర్‌కి కరోనా..!