Oldage Couple Sucide: కుమారులు పట్టించుకోవడం లేదంటూ.. వృద్ధ దంపతుల బలవన్మరణం..

|

Apr 10, 2021 | 10:55 AM

Bhadradri Kothagudem: తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తమను ఎవరూ చూసుకోవడం లేదన్న కారణంతో వృద్ధ దంపతులు

Oldage Couple Sucide: కుమారులు పట్టించుకోవడం లేదంటూ.. వృద్ధ దంపతుల బలవన్మరణం..
Suicide
Follow us on

Bhadradri Kothagudem: తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తమను ఎవరూ చూసుకోవడం లేదన్న కారణంతో వృద్ధ దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ సంఘటన భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలంలోని పట్వారీ గూడెంలో జరిగింది. గ్రామానికి చెందిన దూపకుంట్ల భూషణం (75), ఆది లక్ష్మి (70) దంపతులు కుమారులతో కాకుండా వేరుగా నివాసం ఉంటున్నారు. వృద్ధాప్యంలో ఉండటంతో వారు తరచూ అనారోగ్యం బారిన పడుతున్నారు. కుమారులకు చెప్పినప్పటికీ.. వారు పట్టించుకోపోవడంతో భూషణం, ఆదిలక్ష్మి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలన్మరణానికి పాల్పడ్డారు.

వృద్ధులు ఆత్మహత్యకు పాల్పడుతున్న సమయంలో పెద్ద శబ్దం రావడంతో.. వారి ఇంటి పక్కన ఉంటున్న వారు అనుమానం వచ్చి చూశారు. వెంటనే లోపలికి వెళ్లి చూడగా.. అప్పటికే వృద్ధులు మృతి చెందారు. అనంతరం గ్రామస్థులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు దమ్మపేట పోలీసులు వెల్లడించారు. కాగా.. వృద్ధ దంపతులు ఆత్మహత్యకు పాల్పడటం గ్రామంలో కలకలం సృష్టించింది.

Also Read:
Crime News: ఓయో రూమ్ బుక్ చేయాలనుకున్నాడు.. అడ్డంగా బుక్కైయ్యాడు.. లక్షలు పోగొట్టుకున్నాడు…

కొద్దిరోజుల్లో పెళ్లి.. కానీ యువతి దారుణ హత్య..! కాబోయే వరుడి పనేనా..? కారణాలు ఇలా ఉన్నాయి..