Hyderabad: నడిరోడ్డులో రెచ్చిపోయిన ఆటోవాలా.. ఏకంగా కానిస్టేబుల్ పట్టుకుని బీభత్సం.. తీరా చూస్తే..!

| Edited By: Balaraju Goud

Feb 13, 2024 | 6:26 PM

మద్యం మత్తులో ఓ వ్యక్తి హల్ చల్ చేశాడు. విధుల్లో ఉన్న కానిస్టేబుళ్ళపై విరుచుకుపడ్డాడు. ఈ సంఘటన హైదరాబాద్ మహానగరంలో సోమవారం జరిగింది. అంబర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ నాగరాజుపై బూతు పురాణం అందుకుని దాడి పాల్పడ్డాడు ఓ ఆటోవాలా. ఈ దాడిలో నాగరాజుతో పాటు మరో కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Hyderabad: నడిరోడ్డులో రెచ్చిపోయిన ఆటోవాలా.. ఏకంగా కానిస్టేబుల్ పట్టుకుని బీభత్సం.. తీరా చూస్తే..!
Autowala Attack
Follow us on

మద్యం మత్తులో ఓ వ్యక్తి హల్ చల్ చేశాడు. విధుల్లో ఉన్న కానిస్టేబుళ్ళపై విరుచుకుపడ్డాడు. ఈ సంఘటన హైదరాబాద్ మహానగరంలో సోమవారం జరిగింది. అంబర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ నాగరాజుపై బూతు పురాణం అందుకుని దాడి పాల్పడ్డాడు ఓ ఆటోవాలా. ఈ దాడిలో నాగరాజుతో పాటు మరో కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

అంబర్ పేట్ అలీ కేఫ్ ప్రాంతంలో రాంగ్ రూట్‌లో వచ్చాడు ఓ ఆటోవాలా. రాంగ్ రూట్లో వెళ్లొద్దని సూచించాడు ట్రాఫిక్ కానిస్టేబుల్ నాగరాజు. ఇంకేముందు తాగి మత్తులో ఉన్న ఆటోవాలా ఒక్కసారిగా ఊగిపోయాడు. కానిస్టేబ్ నాగరాజుపై దాడికి పాల్పడ్డాడు. యువకుడిని ఆపేందుకు ప్రయత్నించిన కానిస్టేబుల్ నాగరాజు గొంతు పట్టుకుని అసభ్య పదజాలంతో దూషించాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో కానిస్టేబుల్‌పై సైతం దాడికి యత్నించాడు. అంతేకాదు ఇదే సమయంలో తాగుబోతు తన ఆటోను స్వయంగా ధ్వంసం చేసుకుని, ఆటోకు నిప్పు పెట్టే ప్రయత్నించాడు. అనంతరం తనకు తానూ ఆత్మహత్యాయత్నం చేశారు. అక్కడే గుమిగూడిన స్థానికులు సర్థి చెప్పేందుకు యత్నించారు.

ఆ తర్వాత నిందితుడికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా మద్యం తాగినట్లు పోలీసులు గుర్తించారు. దాడి చేసిన వ్యక్తిని రోహిత్ (25)గా పోలీసులు గుర్తించారు. అనంతరం అంబర్ పోలీసు స్టేషన్ లో కానిస్టేబుల్ ఘటనపై ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం కానిస్టేబుల్ పై మద్యం సేవించిన వ్యక్తి దాడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…