కోదాడలో ఎల్ఐసీ ఏజెంట్ల స్కామ్

| Edited By:

Jun 05, 2019 | 9:21 PM

సూర్యపేట జిల్లా కోదాడలో ఘరానా మోసం బయటపడింది. బతికున్న వారిని చనిపోయినట్లుగా చూపి, బీమా డబ్బును జేబులో వేసుకున్నారు ఎల్‌.ఐ.సీ సిబ్బంది. ఏజెంట్లతోపాటు అధికారులు కుమ్మక్కై.. ఈ కుంభకోణంలో మొత్తం రూ. 3.14 కోట్లు ఇన్సూరెన్స్ డబ్బును అక్రమంగా తమ ఖాతాల్లోకి జమ చేసుకున్నారు. కోదాడ ఎల్‌.ఐ.సీ కార్యాలయంలో అసిస్టెంట్ అడ్మినిస్టేటివ్ ఆఫీసర్‌గా పనిచేసే బానోత్ బీకూ నాయక్, హయ్యర్ గ్రేడ్ అసిస్టెంట్ గులోతు హర్యా ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నారు. మరో ఉద్యోగి రఘుచారి 8 మంది […]

కోదాడలో ఎల్ఐసీ ఏజెంట్ల స్కామ్
Follow us on

సూర్యపేట జిల్లా కోదాడలో ఘరానా మోసం బయటపడింది. బతికున్న వారిని చనిపోయినట్లుగా చూపి, బీమా డబ్బును జేబులో వేసుకున్నారు ఎల్‌.ఐ.సీ సిబ్బంది. ఏజెంట్లతోపాటు అధికారులు కుమ్మక్కై.. ఈ కుంభకోణంలో మొత్తం రూ. 3.14 కోట్లు ఇన్సూరెన్స్ డబ్బును అక్రమంగా తమ ఖాతాల్లోకి జమ చేసుకున్నారు.

కోదాడ ఎల్‌.ఐ.సీ కార్యాలయంలో అసిస్టెంట్ అడ్మినిస్టేటివ్ ఆఫీసర్‌గా పనిచేసే బానోత్ బీకూ నాయక్, హయ్యర్ గ్రేడ్ అసిస్టెంట్ గులోతు హర్యా ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నారు. మరో ఉద్యోగి రఘుచారి 8 మంది ఏజెంట్లతో కుమ్మక్కయ్యారు. నకిలీ మరణ దృవీకరణ పత్రాలు సృష్టించి వాటి ఆధారంగా ఎల్‌ఐసీకి చెందిన సోమ్మును డ్రా చేసుకున్నారు. పత్రాల్లో తెలిపిన నామినీల బ్యాంక్ ఖాతాల్లో కాకుండా సొంత ఖాతాల్లోకి డబ్బును మళ్లించుకున్నారు.

2006 నుంచి 2018 మధ్యకాలంలో దాదాపు 190 నకిలీ పాలసీలు సృష్టించి 3.14 కోట్ల రూపాయలను తమ జేబులో వేసుకున్నారు. ప్రధాన నిందితుడు అసిస్టెంట్ అడ్మినిస్టేటివ్ ఆఫీసర్ బీకూ నాయక్ తండ్రి బతికుండగానే చనిపోయినట్లు పత్రాలు సృష్టించి పాలసీని డ్రా చేసుకున్నాడు. లావాదేవీలపై అనుమానం వచ్చిన కోదాడ ఎల్‌ఐసీ చీఫ్ మేనేజర్ విచారణ జరిపించారు.

అంతర్గత విచారణలో వీరి భాగోతాలు వెలుగుచూశాయి. దీంతో ఈ కేసును పూర్తిస్థాయిలో విచారించాలని సీబీఐకి ఫిర్యాదు చేశారు. దీంతో బీకూ నాయక్, గుగులోత్ హర్యా, ఏజెంట్లపై ఐపీసీ 120 బీ, 409, 420, 465, 467, 468, 471, 477ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు అధికారులు.