కాలిబూడిదైన కారు.. ప్రయాణికుల తప్పిన ముప్పు

|

Sep 05, 2020 | 4:32 PM

వైఎస్సార్‌ కడప జిల్లాలో పెనుప్రమాదం తప్పింది. సుండుపల్లె మండలం భాగంపల్లి వద్ద ఓ కారులో దట్టమైన మంటలు చెలరేగాయి. భారీ మంటలకు కారు పూర్తిగా దగ్ధమైంది.

కాలిబూడిదైన కారు.. ప్రయాణికుల తప్పిన ముప్పు
Follow us on

వైఎస్సార్‌ కడప జిల్లాలో పెనుప్రమాదం తప్పింది. సుండుపల్లె మండలం భాగంపల్లి వద్ద ఓ కారులో దట్టమైన మంటలు చెలరేగాయి. భారీ మంటలకు కారు పూర్తిగా దగ్ధమైంది. చిత్తూరు నుంచి వైఎస్సార్‌ కడపకి వెళ్తున్న కారులో పొగలు వ్యాపించి ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. కారులో ప్రయాణిస్తున్నవారు మంటలను గుర్తించి వెంటనే అప్రమత్తమై కారు నుంచి దిగి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. దీంతో కారులో ప్రయాణిస్తున్న వారికి ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఒక్కసారిగా దట్టమైన మంటలు చెలరేగడంతో తీవ్ర భయాందోళనకు గురైనట్లు కారులోని ప్రయాణికులు తెలిపారు. ఇంజన్ లో షాక్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాప్తించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.