AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Father Murder: వృద్ధుడి ప్రాణం తీసిన అరు సెంట్ల భూమి.. కన్న తండ్రిని కడతేర్చిన కసాయి కొడుకు

సభ్య సమాజంలో మానవత్వం మంటగలుస్తోంది. వృద్ధాప్యంలో తండ్రికి చేదోడు వాదోడుగా ఉండాల్సిన కొడుకు, కని పెంచిన తండ్రినే కడతేర్చాడు. అతి కిరాతకంగా 50 ఏళ్ళ వయస్సులో ఉన్న తండ్రిని హత్య చేశాడు. అపై క్రూరంగా డీజిల్ పోసి నిప్పు అంటించాడు. అత్యంత దారుణమైన ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుంది.

Father Murder: వృద్ధుడి ప్రాణం తీసిన అరు సెంట్ల భూమి.. కన్న తండ్రిని కడతేర్చిన కసాయి కొడుకు
Crime
P Kranthi Prasanna
| Edited By: Balaraju Goud|

Updated on: Dec 17, 2023 | 12:39 PM

Share

సభ్య సమాజంలో మానవత్వం మంటగలుస్తోంది. వృద్ధాప్యంలో తండ్రికి చేదోడు వాదోడుగా ఉండాల్సిన కొడుకు, కని పెంచిన తండ్రినే కడతేర్చాడు. అతి కిరాతకంగా 50 ఏళ్ళ వయస్సులో ఉన్న తండ్రిని హత్య చేశాడు. అపై క్రూరంగా డీజిల్ పోసి నిప్పు అంటించాడు. అత్యంత దారుణమైన ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుంది.

కృష్ణా జిల్లాలోని అవనిగడ్డలో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. నాగాయలంక మండలం బవదేవరపల్లికి చెందిన హరి మోహన్‌కు ఒక కొడుకు, ఒక కూతురు. కుమార్తెకు పెళ్లి చేసీన ఆ తండ్రికి 24 ఏళ్ళ కొడుకు కుడా వున్నాడు. కొన్నెల క్రితం భార్య మంచాన పడి చనిపోయింది. దాంతోఐదో తరగతి వరకు చదువుకున్న కొడుకు అమ్మమ్మ ఇంట్లో ఉంటూ తాపీ పని చేస్తున్నాడు.

అయితే చెడు వ్యసనాలకు బానిసైన కొడుకును తండ్రి హరి మోహన్ పలుమార్లు మందలించాడు. అతగాడి మీద గతంలో గుంటూరులో ఒక చైన్ స్నాచింగ్ కేసు కుడా నమోదైంది. తండ్రి ఒక్కడే తనకున్న అరు సెంట్ల స్థలంలో చిన్నా పురింట్లో ఉంటూ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. 50 ఏళ్ళ వయసులో తండ్రికి అండగా ఉండాల్సిన కొడుకు, తండ్రికి ఉన్న ఆరు సెంట్ల స్థలంపై కన్నేశాడు. గత కొద్ది రోజులుగా ఆ స్థలం విషయంలో తండ్రితో గొడవ పడుతున్నాడు. ఎలాగైనా ఆ స్థలాన్ని అమ్మి సొమ్ము చేసుకోవాలని భావించాడు కొడుకు.

ఎంత అడిగినా తండ్రి ఒప్పుకోక పోవటంతో, శనివారం రాత్రి ఇదే విషయంపై తండ్రితో గొడవపడి తలపై బలంగా కొట్టారు. దీంతో అక్కడికక్కడే కుప్పకూలిన తండ్రి ప్రాణాలు విడిచాడు. ఆపై ఇంట్లోనే తండ్రి మృతదేహంపై డీజిల్ పోసి నిప్పు పెట్టాడు. ఇంట్లోంచి పొగ బయటకు రావటంతో గమనించిన ఇరుగు పొరుగు వారు ఘటన స్థలానికి చేరుకుని అపే ప్రయత్నం చేసిన అప్పటికే జరగాల్సిన దారుణం జరిగిపోయింది. దాంతో ఒక్కసారిగా ఊరి జనం ఉలిక్కి పడ్డారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

24 ఏళ్ళ వయసులో తండ్రిని కిరాతకంగా హత్య చేసిన కొడుకుని పోలీసులు పట్టించారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…