Viral News: 24 ఏళ్లుగా వినియోగంలో లేని ఆసుపత్రి లిఫ్ట్‌.. తీరా తెరిచి చూస్తే భయంకరమైన దృశ్యం..

|

Sep 06, 2021 | 3:32 PM

Viral News: ఉత్తర ప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలోని కైలీలో ఉన్న ఓపెక్‌ అనే ఆసుపత్రిలో వెలుగు చూసిన ఓ సంఘటన ఒక్కసారిగా భయాందోళనకు గురి చేసింది. చాలా కాలం పాటు...

Viral News: 24 ఏళ్లుగా వినియోగంలో లేని ఆసుపత్రి లిఫ్ట్‌.. తీరా తెరిచి చూస్తే భయంకరమైన దృశ్యం..
Follow us on

Viral News: ఉత్తర ప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలోని కైలీలో ఉన్న ఓపెక్‌ అనే ఆసుపత్రిలో వెలుగు చూసిన ఓ సంఘటన ఒక్కసారిగా భయాందోళనకు గురి చేసింది. చాలా కాలం పాటు పనిచేయకుండా ఉన్న ఓ లిఫ్ట్‌ను తెరిచి చూసేసరికిగుర్తి తెలియని ఓ వ్యక్తి ఆస్థిపంజరం బయటపడింది. సెప్టెంబర్‌ 1న వెలుగులోకి వచ్చిన ఈ వార్త ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇంతకీ ఆ ఆస్థిపంజరం ఎవరన్న దానిపై పోలీసులు విచారణ ప్రారంభించారు.

వివరాల్లోకి వెళితే.. కైలిలో 500 మంచాల సామర్థ్యం ఉన్న ఆసుపత్రి నిర్మాణాన్ని 1991లో ప్రారంభించారు. అయితే ఈ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన లిఫ్ట్‌ 1997 వరకు పనిచేసింది.. ఆ తర్వాత నిర్వాహణ లేకపోవడంతో ఆగిపోయింది. అప్పటి నుంచి లిఫ్ట్‌ జోలికి ఎవరూ పోలేదు. ఇదిలా ఉంటే తాజాగా 24 ఏళ్ల తర్వాత ఆసుపత్రి వర్గాలు లిఫ్ట్‌ను ఇటీవల తిరిగి తెరిచేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలోనే లిఫ్ట్‌ కింద వారికి ఓ ఆస్థిపంజరం లభించింది. పోలీసుల ప్రాథమిక విచారణలో ఆ ఆస్తిపంజరం మగ వ్యక్తిగా తేలింది. సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఫోరెన్సిక్‌ నిపుణులు డీఎన్‌ఏ పరీక్షకు పంపించారు. ఇక విచారణ ప్రారంబించిన పోలీసుల 24 ఏళ్ల క్రితం తప్పినపోయిన కేసులు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో పరిశోధన ప్రారంభించారు.

ఇక ఈ ఆస్థిపంజరంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ ఆ వ్యక్తి లిఫ్ట్‌లో ఇరుక్కు పోవడం వల్ల మరణించాడా.? లేదా ఎవరైనా హత్య చేశారా? అన్నది పెద్ద మిస్టరీగా మారింది. డీఎన్ఏ రిపోర్ట్‌లు వచ్చిన తర్వాతే పూర్తి విషయాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఈ విషయమై బస్తీ సూపరిండెంట్‌ దీపేంద్ర నాథ్‌ చౌదనీ మాట్లాడుతూ.. ‘ఈ కేసు విషయమై ఎవరైనా రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తాం. ప్రస్తుతం ఈ మిస్టరీని చేధించడానికి పలు కోణాల్లో విచారణ చేపడుతున్నాం. ఈ ఆస్థిపంజరం ఎవరిదనే విషయాన్ని తెలుసుకునేందుకు గాను జిల్లా వ్యాప్తంగా ఉన్న 24 స్టేషన్లకు చెందిన పోలీసులు రంగంలోకి దిగారు’ అని చెప్పుకొచ్చారు.

Also Read: