Chittoor District: నిన్న అదృశ్యమైన 8 ఏళ్ల బాలుడు తేజసాయిరెడ్డి హత్య.. పొలాల్లో మృతదేహం

|

Oct 13, 2021 | 5:47 PM

చిత్తూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. 8 ఏళ్ల బాలుడు తేజసాయిరెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు.

Chittoor District: నిన్న అదృశ్యమైన 8 ఏళ్ల బాలుడు తేజసాయిరెడ్డి హత్య.. పొలాల్లో మృతదేహం
Boy Murder
Follow us on

చిత్తూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. 8 ఏళ్ల బాలుడు తేజసాయిరెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. అభం శుభం తెలియని చిన్నారిని పొట్టనబెట్టుకున్నారు. కె.వి పల్లి మండలం ఎగువ మేకల వారి పల్లికి చెందిన తేజసాయిరెడ్డి తల్లిదండ్రులు నాగిరెడ్డి, జ్యోతి ఉపాధి కోసం కువైట్ కి వెళ్లారు. అప్పటి నుంచి పీలేరులో ఉన్న పెద్దమ్మ ఇంట్లో ఉంటూ తేజేష్ స్కూలుకు వెళ్తున్నాడు. పండుగ సెలవుల కావడంతో.. అమ్మమ్మ పార్వతమ్మ ఇంటికి వెళ్లాడు. పండంటి పిల్లాడిపై ఎవరి కన్ను పడిందో ఏమో.. మంగళవారం కిడ్నాప్ చేశారు. బంధువులంతా వెతికినా బాలుడి ఆచూకీ లభించలేదు. తెల్లారి చూసేసరికి సమీపంలోని బొప్పాయి తోటలో తేజసాయిరెడ్డి శవమై కనిపించాడు. బాలుడ్ని గొంతు నులిమి చంపినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమీప బంధువులే తేజసాయిరెడ్డిని హతమార్చి ఉంటారనేది కుటుంబ సభ్యుల ఆరోపణ.

అసలే తల్లిదండ్రులు ఇక్కడ ఉండట్లేదు.. మరి చిన్నారిని చంపేంత కర్కశత్వం ఎలా వస్తుంది? ఆ 8 ఏళ్ల బాలుడు చేసిన తప్పేంటి? అమ్మమ్మ వాళ్లింటికి వెళ్లిన వాడిని అంతులేని లోకాలకు ఎవరు పంపారు? కుటుంబ, ఆస్తి తగాదాలతో చిన్నారిపై కక్షా? ఈ దారుణానికి ఒడిగట్టిన ఆ ఘాతకులు ఎవరు? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. స్థానికంగా ఈ ఘటన సంచలనంగా మారింది.

Also Read: మరో అల్పపీడనం ముప్పు.. ఏపీలోని ఈ ప్రాంతాలకు వర్ష సూచన

ప్రకాశ్ రాజ్ ప్యానల్ ఆరోపణలపై ఘాటుగా స్పందించిన నరేశ్.. సంచలన వ్యాఖ్యలు