Accident: లారీ దిగి టీ కొట్టుకు వెళ్లినా వెంటాడిన మృత్యువు… మరో లారీ రూపంలో..

|

Jul 01, 2022 | 11:53 AM

Accident: మృత్యువు లారీ రూపంలో దూసుకొచ్చింది. టీ తాగుదామని కిందికి దిగడమే వారికి శాపంగా మారింది. రెండు నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ విషాధ సంఘటన శుక్రవారం ఉదయం ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో...

Accident: లారీ దిగి టీ కొట్టుకు వెళ్లినా వెంటాడిన మృత్యువు... మరో లారీ రూపంలో..
Follow us on

Accident: మృత్యువు లారీ రూపంలో దూసుకొచ్చింది. టీ తాగుదామని కిందికి దిగడమే వారికి శాపంగా మారింది. రెండు నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ విషాధ సంఘటన శుక్రవారం ఉదయం ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో చోటు చేసుకొంది. వివరాల్లోకి వెళితే.. ఆయిల్‌ ట్యాంకర్‌తో వెళుతోన్న ముగ్గురు వ్యక్తులు టీ తాగుదామని పల్నాడు జిల్లా రొంపిచర్చ మండలం సంతగుడిపాడు వద్ద రోడ్డు దిగ్గారు. రోడ్డు పక్కనే ఉన్న టీ కొట్టు వద్ద నిల్చొని టీ తాగుతున్నారు.

ఇదే సమయంలో అటుగా వచ్చిన ఓ లారీ అతివేగంగా దూసుకొచ్చింది. రోడ్డుపై టీ తాగుతోన్న ముగ్గురి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ క్లిన్‌ బిల్లా కోటేశ్వరారు (46), టీ కొట్టు యజమాని రాజశేఖర రెడ్డి (22) అక్కడిక్కడే మృతి చెందారు. డ్రైవర్‌ రాజేశ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయన్ని వెంటనే నరసరావు పేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న రొంపిచర్ల పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. లారీడ్రైవర్‌, క్లీనర్‌లు ఒంగోలు జిల్లా తూర్పు నాయుడు పాలెం వాసులుగా గుర్తించారు. ప్రమాదానికి కారణమైన లారీని గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..