పేదలకిచ్చిన ఒక్కో గోధుమ పిండి సంచిలో రూ.15 వేల క్యాష్!

| Edited By:

Apr 28, 2020 | 4:34 PM

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఆకలితో అలమటిస్తోన్న పేద ప్రజలను ఆదుకునేందుకు ఎంతో మంది ప్రముఖులు, సెలబ్రిటీలు ముందుకొస్తున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ సైతం ఆహార పదార్థాలను..

పేదలకిచ్చిన ఒక్కో గోధుమ పిండి సంచిలో రూ.15 వేల క్యాష్!
Follow us on

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఆకలితో అలమటిస్తోన్న పేద ప్రజలను ఆదుకునేందుకు ఎంతో మంది ప్రముఖులు, సెలబ్రిటీలు ముందుకొస్తున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ సైతం ఆహార పదార్థాలను పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో అమీర్ ఖాన్ తన వంతుగా సామాజిక సేవను వినూత్నంగా చేసినట్టు ప్రచారం జరుగుతోంది. గోధుమ పిండి సంచుల్లో పేదల కోసం రూ.15 వేలు పంపించాడనే ఓ వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు అమీర్ ఖాన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఏప్రిల్ 23న ఢిల్లీలోని నిరుపేద ప్రాంతానికి వచ్చిన వాలంటీర్లు ట్రక్‌లోంచి గోధుమ పిండి సంచులు తీసి పంచడం ప్రారంభించారు. వాటి కోసం చాలా మంది క్యూ లైన్లలో నిల్చొని ఇంటికి తీసుకెళ్లారు. మరికొందరు గోధుమ పిండి మాత్రమే ఇస్తున్నారని నిరాకరించారు. ఇక సంచులు తీసుకున్నవారు దాన్ని తెరిచి చూడగా.. అందులో రూ. 15 వేలు ఉన్నట్లు గ్రహించారు. ఇలా ఒక ప్యాకెట్ ఇవ్వడం ద్వారా ఎంతో అవసరం ఉన్న వారు మాత్రమే తీసుకుంటారని.. అమీర్ ఖాన్ ప్లాన్ చేసినట్లు అందరూ చెప్పుకుంటున్నారు. అయితే వీటిని నిజంగానే అమీర్‌ ఖాన్ పంపించారా? లేదా అనేది తేలాలంటే.. ఆయనే స్వయంగా స్పందించాల్సి ఉంటుంది.

Read More: 

మూడో విడత రేషన్ పంపిణీ.. ఈసారి బయోమెట్రిక్ తప్పనిసరి తాజా రూల్స్ ఇవే!

లైవ్‌లో ‘ఐలవ్‌యూ చెప్పి ముద్దు’ అడిగిన నెటిజన్.. ఇంటికొచ్చి మరీ తంతానంటోన్న హేమ

మళ్లీ లాక్‌డౌన్‌ పొడిగింపుకే మొగ్గుచూపుతోన్న సీఎం కేసీఆర్

బ్రేకింగ్: గాంధీ ఆస్పత్రిలో ప్లాస్మా థెరపీకి గ్రీన్ సిగ్నల్