Coronavirus: టీఆర్‌ఎస్‌లో కరోనా కలవరం.. వైరస్‌ బారిన పడిన మెదక్‌ ఎమ్మెల్యే..

|

Jan 13, 2022 | 11:49 AM

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇబ్బడిముబ్బడిగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ ముఖ్యంగా తెలంగాణలోనూ రోజువారిగా నమోదవుతోన్న కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది

Coronavirus: టీఆర్‌ఎస్‌లో కరోనా కలవరం.. వైరస్‌ బారిన పడిన మెదక్‌ ఎమ్మెల్యే..
Padma Devender Reddy
Follow us on

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇబ్బడిముబ్బడిగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ ముఖ్యంగా తెలంగాణలోనూ రోజువారిగా నమోదవుతోన్న కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలో పలువురు రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా టీఆర్‌‌ఎస్‌ మెదక్‌ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌ రెడ్డికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. కరోనా స్వల్ప లక్షణాలు ఉండడంతో పద్మాదేవేందర్‌ రెడ్డి ప్రస్తుతం హోమ్‌ ఐసోలేషన్‌లో చికిత్స తీసుకుంటున్నారు.

ఈ సందర్భంగా తనతో సన్నిహితంగా ఉన్న వారందరూ కరోనా నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలంటూ పద్మా దేవేందర్‌ రెడ్డి కోరారు. కాగా ఇటీవల టీఆర్ఎస్ నేతలు వరుసగా వైరస్‌ బారిన పడుతున్నారు. టీఆర్ఎస్ సీనియర్ నేత కే. కేశవరావు, మంత్రి జగదీశ్ రెడ్డి తదితరులు ఇటీవల కరోనా బాధితుల జాబితాలో చేరిన సంగతి తెలిసిందే . తాజాగా మరో ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలతో నిరంతరం బిజీగా ఉండే నేతలు కరోనా బారిన పడుతుండడంతో శ్రేణుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా తెలంగాణలో కొవిడ్ కేసులు పెరుగుతండడంతో ఇప్పటికే వైద్య సిబ్బందికి సెలవులను రద్దు చేసింది ప్రభుత్వం. ఆదివారం కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగించాలని నిర్ణయించింది.