ఏపీలో తాజాగా మూడో విడత రేషన్ పంపిణీ చేయనున్నారు అధికారులు. దీంతో మళ్లీ కొత్త రూల్స్ తీసుకొచ్చింది ప్రభుత్వం. ఇప్పటికే కొన్ని వెసులు బాట్లతో లాక్డౌన్ అమల్లో ఉండటంతో సీఎం జగన్ ఆదేశాల ప్రకారం పేదలకు మూడోసారి రేషన్ సరుకుల పంపిణీ ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఏ సరుకులు ఇవ్వాలి? ఎలా ఇవ్వాలి? సోషల్ డిస్టెన్స్ ఎలా పాటించాలి? అనే అంశాలపై.. రెవెన్యూ అధికారులు, డీలర్లకు పౌరసరఫరాల శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి కోన శశిధర్ మార్గదర్శకాలు జారీ చేశారు.
1. బియ్యం కార్డు దారులకు ఏప్రిల్ 29 నుంచి మే 10వ తేదీ వరకూ ఉచిత సరుకుల పంపిణీ ఉంటుంది.
2. టైమ్ స్లాట్ టోకెన్ ఇస్తారు. ఒక్కో షాపులో రోజుకు 30 మందికి సరుకులు పంపిణీ చేస్తారు.
3. మొదటి, రెండు విడతల్లో వీఆర్వో లేదా ఇతర అధికారుల బయో మెట్రిక్ ద్వారానే రేషన్ అందించారు
4. కానీ మూడో విడతలో మాత్రం లబ్దిదారుల సొంత బయోమెట్రిక్ తప్పనిసరి
5. కరోనా జాగ్రత్తలో భాగంగా అన్ని రేషన్ షాపుల దగ్గర శానిటైజర్లు, మాస్కులు అందుబాటులో ఉంటున్నాయి
6. బయోమెట్రిక్కి ముందు, తర్వాత తప్పనిసరిగా శానిటైజ్ వాడాలి
7. రేషన్ షాపుల్లో ఖచ్చితంగా డీలర్ శానిటజర్, మాస్కులను ఉంచాలి. లేని పక్షంలో ప్రజలు నిలదీయవచ్చు. మొత్తం పంపిణీని ఆపేసి పోలీసులకు కంప్లైట్ ఇవ్వొచ్చు
8. ఇక ముఖ్యంగా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ రేషన్ సరుకుల్ని తీసుకోవాలి.
Read More:
లైవ్లో ‘ఐలవ్యూ చెప్పి ముద్దు’ అడిగిన నెటిజన్.. ఇంటికొచ్చి మరీ తంతానంటోన్న హేమ
మళ్లీ లాక్డౌన్ పొడిగింపుకే మొగ్గుచూపుతోన్న సీఎం కేసీఆర్