కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు.. తాజాగా మార్గదర్శకాల విడుదల.. 100 మంది సీలింగ్‌తో సమావేశాలకు అనుమతి

| Edited By: Pardhasaradhi Peri

Nov 18, 2020 | 10:17 AM

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి కోరలుచాస్తోంది. శీతకాలంలో పాజిటివ్ కేసుల సంఖ్య అధికమవుతాయన్న నిపుణుల హెచ్చరికలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.

కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు.. తాజాగా మార్గదర్శకాల విడుదల.. 100 మంది సీలింగ్‌తో సమావేశాలకు అనుమతి
Follow us on

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి కోరలుచాస్తోంది. శీతకాలంలో పాజిటివ్ కేసుల సంఖ్య అధికమవుతాయన్న నిపుణుల హెచ్చరికలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. తాజాగా వైరస్ వ్యాప్తిని కట్టడిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. అన్‌లాక్ మార్గదర్శకాల్లో పాక్షిక మార్పులు చేస్తూ కొత్త గైడ్ లైన్స్ విడుదల చేసింది. నాలుగు గోడల మధ్య సామాజిక, క్రీడలు, వినోదం, సాంస్కృతిక, మత, రాజకీయ సమావేశాలకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ నిబంధనల మేరకు 200 మంది హాల్ సామర్థ్యంలో 50 శాతం హాజరుతో సామాజిక సమావేశాలు అనుమతినిచ్చింది.

రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారంః

# సామాజిక, విద్య, క్రీడలు, వినోదం, సాంస్కృతిక, మత, రాజకీయ కార్యక్రమాలు, ఇతర సమ్మేళనాలకు 100 మంది హాల్ సామర్ధ్యంతో జరుపుకోవడానికి ఇప్పటికే అనుమతి ఇచ్చారు.
# సమ్మేళనాలు రాష్ట్రంలోని కంటైన్మెంట్‌ జోన్ల వెలుపల మాత్రమే అనుమతిస్తారు.
# ఫేస్ మాస్క్‌లు ధరించడం, నిర్ణీత దూరాన్ని పాటించడం, థర్మల్ స్కానింగ్, హ్యాండ్ వాష్ లేదా శానిటైజర్ వాడకం తప్పనిసరి.
# బహిరంగ ప్రదేశాల్లో భూమి / స్థలం పరిమాణాన్ని దృష్టిలో ఉంచుకుని, నిర్ణీత దూరాన్ని కఠినంగా పాటించడం తప్పనిసరి.
# ఫేస్ మాస్క్‌లు ధరించడం, థర్మల్ స్క్రీనింగ్ సదుపాయంతోపాటు హ్యాండ్ వాష్ లేదా శానిటైజర్ తప్పనిసరిగా అందుబాటులో ఉంచడం ద్వారా జిల్లా కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, పోలీసు సూపరింటెండెంట్లు అనుమతి.
# కంటైన్మెంట్‌ జోన్ల వెలుపల 100 మంది సీలింగ్‌తో బిజినెస్ టు బిజినెస్ ఎగ్జిబిషన్లు, సామాజిక, రాజకీయ, మతపరమైన సమావేశాలు వంటి కార్యకలాపాలను అనుమతి.