AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రేకింగ్‌ న్యూస్.. ఇక సహాయం చేస్తూ సెల్ఫీ దిగితే కేసులే..!

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఎంతలా విజృంభిస్తోందో తెలిసిందే. అయితే ఈ క్రమంలో ఈ వైరస్‌ను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక కఠిన చర్యలు తీసుకోంటోంది. ఇప్పటికే ఏప్రిల్ 14వరకు లాక్‌డౌన్ విధించింది. తాజాగా.. ఈ గడువును పొడిగించే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో సామాన్య ప్రజానీకానికి తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నా.. ప్రభుత్వం నిత్యవసర సరకుల విషయంలో సడలింపు ఇచ్చింది. ఇక రోజు వారి కూలీలు, వలస వెళ్లిన వారు నిత్యవసరాల విషయంలో.. ఆహార విషయంలో […]

బ్రేకింగ్‌ న్యూస్.. ఇక సహాయం చేస్తూ సెల్ఫీ దిగితే కేసులే..!
selfie
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 10, 2020 | 2:58 PM

Share

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఎంతలా విజృంభిస్తోందో తెలిసిందే. అయితే ఈ క్రమంలో ఈ వైరస్‌ను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక కఠిన చర్యలు తీసుకోంటోంది. ఇప్పటికే ఏప్రిల్ 14వరకు లాక్‌డౌన్ విధించింది. తాజాగా.. ఈ గడువును పొడిగించే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో సామాన్య ప్రజానీకానికి తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నా.. ప్రభుత్వం నిత్యవసర సరకుల విషయంలో సడలింపు ఇచ్చింది. ఇక రోజు వారి కూలీలు, వలస వెళ్లిన వారు నిత్యవసరాల విషయంలో.. ఆహార విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అయితే పలు స్వచ్ఛంద సేవ సంస్థలు వీరికి ఉచితంగా నిత్యవసర సరకులతో పాటు.. ఆహారాన్ని పంపిణీ చేస్తున్నాయి. అయితే ఈ క్రమంలో మెజార్టీ సేవకులు స్వీకరిస్తున్న వారితో కలిసి సెల్ఫీలు దిగుతూ సోషల్ మీడియాలో పోస్టింగ్‌ చేస్తున్నారు. దీంతో వారేదో యాచిస్తున్నారా.. అవసరానికి తీసుకుంటున్నారా అంటూ పలువురు నెటిజన్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాజస్థాన్‌లోని అజ్మీర్‌ కలెక్టర్ స్పందించారు. ఇక ఎవరైనా సరే.. సహాయం చేస్తూ బాధితులతో కలిసి సెల్ఫీ తీసుకోవడం చేయొద్దని..సెల్ఫీలను నిషేధిస్తూ అజ్మీర్‌ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలను ఉల్లంఘిస్తే.. ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.