వారి నుంచి చార్జీలు వసూలు చేయొద్దు.. రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశం

| Edited By: Pardhasaradhi Peri

May 28, 2020 | 7:00 PM

వలస జీవుల తరలింపు కోసం రైల్వే శాఖ రైళ్లను సమకూర్చాలని, రాష్ట్రాలు ఎప్పుడు కోరినా ఇందుకు సిధ్ధంగా ఉండాలని సుప్రీంకోర్టు సూచించింది. వారు ఎలాంటి చార్జీలూ చెల్లించబోరని పేర్కొంది...

వారి నుంచి చార్జీలు వసూలు చేయొద్దు.. రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశం
Follow us on

వలస జీవుల తరలింపు కోసం రైల్వే శాఖ రైళ్లను సమకూర్చాలని, రాష్ట్రాలు ఎప్పుడు కోరినా ఇందుకు సిధ్ధంగా ఉండాలని సుప్రీంకోర్టు సూచించింది. వారు ఎలాంటి చార్జీలూ చెల్లించబోరని పేర్కొంది. వీరు రైళ్లలో ప్రయాణించేటప్పుడు వారికి ఆహారం, నీరు అందించాల్సిన బాధ్యత రైల్వే  శాఖదే అని స్పష్టం చేసింది.   వలస కార్మికుల రిజిస్ట్రేషన్ ను రాష్ట్రాలు పర్యవేక్షించాలి.. వారు బస్సు లేదా రైలెక్కినా ఇది సజావుగా జరిగేలా చూడాలి.. ఒకవేళ రాష్ట్రాల్లోనే చిక్కుబడి ఉంటే ఆహారం, నీరు, షెల్టర్ సదుపాయాలు కల్పించాలి.. ఈ విషయాన్ని సంబంధిత సంస్థలకు, వ్యక్తులకు తెలియజేయాలి అని కోర్టు ఆదేశించింది. వీరి చార్జీలను రాష్ట్రాలే షేర్ చేసుకోవాలని కూడా ముగ్గురు సభ్యుల ధర్మాసనం పేర్కొంది.

రైల్వేలు కేవలం 3 శాతం కెపాసిటీతో నడుస్తున్నాయని, ఇలా అయితే మైగ్రెంట్ వర్కర్ల తరలింపునకు 3 నెలల సమయం పడుతుందని ప్రముఖ లాయర్లు కపిల్ సిబాల్, ఇందిరా జైసింగ్ కోర్టు దృష్టికి తెచ్చారు. 1991  సెన్సస్ ప్రకారం వలస కార్మికులు 3 కోట్లకు పైగా ఉన్నారని, ఈ ఏడాదికి చూస్తే ఇది నాలుగు కోట్లకు మించి ఉంటుందని అనుకుంటే 27 రోజుల్లో ప్రభుత్వం 91 లక్షల మందిని తరలిస్తే ఇతరులను షిఫ్ట్ చేయడానికి మూడు నెలలు పడుతుందని కపిల్ సిబాల్ పేర్కొన్నారు.