కస్టమర్లకు ఎస్బీఐ గుడ్ న్యూస్.. మరో మూడు నెలలు మారిటోరియం పొడిగింపు!
స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా తన కస్టమర్లకు గుడ్ న్యూస్ అందించింది. ముఖ్యంగా లోన్ తీసుకున్నవారికి ఊరటను ఇచ్చింది. అన్ని టర్మ్ లోన్ల EMIలను మరో మూడు నెలల పాటు ఆటోమేటిక్గా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. కరోనా సంక్షోభం వల్ల రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా గతంలో లోన్లపై మూడు నెలల మారిటోరియం ప్రకటించిన సంగతి తెలిసిందే. అది మార్చి 1 నుంచి మే 31 వరకు వర్తిస్తుంది. అయితే తాజాగా మరోసారి ఆర్బీఐ మరో మూడు […]
స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా తన కస్టమర్లకు గుడ్ న్యూస్ అందించింది. ముఖ్యంగా లోన్ తీసుకున్నవారికి ఊరటను ఇచ్చింది. అన్ని టర్మ్ లోన్ల EMIలను మరో మూడు నెలల పాటు ఆటోమేటిక్గా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. కరోనా సంక్షోభం వల్ల రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా గతంలో లోన్లపై మూడు నెలల మారిటోరియం ప్రకటించిన సంగతి తెలిసిందే. అది మార్చి 1 నుంచి మే 31 వరకు వర్తిస్తుంది.
అయితే తాజాగా మరోసారి ఆర్బీఐ మరో మూడు నెలల పాటు మారిటోరియం కొనసాగించనున్నట్లు వెల్లడించింది. దీనితో రెండో మారిటోరియం జూన్ 1 నుంచి ఆగష్టు 31 వరకు ఉంటుంది. ఇంకా ఈ విషయంపై బ్యాంకులు నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా.. SBI మాత్రం టర్మ్ లోన్ల ఈఎంఐలపై మరో మూడు నెలలు మారిటోరియం కొనసాగిస్తున్నట్లు అధికారికంగా వెల్లడించింది. ఈ సమాచారాన్ని సుమారు 85 లక్షల కస్టమర్లకు ఎస్ఎంఎస్ల ద్వారా పంపిస్తోంది. ఎస్బీఐ సూచించిన నెంబర్కు ఖాతాదారులు YES అని మెసేజ్ పంపించాలి. EMIలు వాయిదా వేసుకోవాలని అనుకుంటున్నవారు బ్యాంక్ నుంచి మెసేజ్ వచ్చిన ఐదు రోజుల్లో తిరిగి తమ సమాధానాన్ని పంపించాలి.
Read More:
తెలంగాణలో ఆర్టీసీ బస్సులకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు..
CBSE విద్యార్ధులకు గుడ్ న్యూస్.. సొంత జిల్లాల నుంచే పరీక్షలు..
ఆన్లైన్ ద్వారా పీఎఫ్ డబ్బును ఈజీగా విత్ డ్రా చేసుకోండిలా..!
విద్యార్థుల తల్లిదండ్రులకు ఆయుధం.. సీఎం జగన్ కొత్త వెబ్సైట్..