తెలంగాణలో ఆర్టీసీ బస్సులకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు..
తెలంగాణలో ఆర్టీసీ బస్సులకు కర్ఫ్యూ నుండి మినహాయింపు ఇస్తున్నట్లు సీఎం కేసిఆర్ ప్రకటించారు. ఇవాళ్టి నుంచి ఈ రూల్ అమలులోకి రానుండగా.. రాష్ట్రంలో యధావిధిగా ఆర్టీసీ బస్సు సర్వీసులు కొనసాగనున్నాయి. ఇప్పటివరకు జిల్లాల నుంచి వచ్చే బస్సులను HYDలోని JBSలోకి మాత్రమే అనుమతించిన అధికారులు.. గురువారం నుంచి MGBSలోకి కూడా అనుమతిస్తారు. అటు HYDలో సిటీ బస్సు సర్వీసులపై మరికొన్ని రోజుల పాటు నిషేధం కొనసాగుతుందన్నారు. బస్టాండ్లలోకి ట్యాక్సీలు, ఆటోలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. బస్సు […]
తెలంగాణలో ఆర్టీసీ బస్సులకు కర్ఫ్యూ నుండి మినహాయింపు ఇస్తున్నట్లు సీఎం కేసిఆర్ ప్రకటించారు. ఇవాళ్టి నుంచి ఈ రూల్ అమలులోకి రానుండగా.. రాష్ట్రంలో యధావిధిగా ఆర్టీసీ బస్సు సర్వీసులు కొనసాగనున్నాయి. ఇప్పటివరకు జిల్లాల నుంచి వచ్చే బస్సులను HYDలోని JBSలోకి మాత్రమే అనుమతించిన అధికారులు.. గురువారం నుంచి MGBSలోకి కూడా అనుమతిస్తారు.
అటు HYDలో సిటీ బస్సు సర్వీసులపై మరికొన్ని రోజుల పాటు నిషేధం కొనసాగుతుందన్నారు. బస్టాండ్లలోకి ట్యాక్సీలు, ఆటోలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. బస్సు టికెట్ కలిగిన ప్రయాణీకులు రాత్రి పూట కూడా ప్రైవేటు వాహనాల్లో తమ ఇళ్లకు చేరుకోవచ్చునని.. పోలీసులు అభ్యంతరం తెలపరని రవాణాశాఖ వెల్లడించింది. కాగా, అంతర్రాష్ట్ర ఆర్టీసీ సర్వీసులకు అనుమతి లేదన్నారు.
Read More:
ఇకపై వాట్సాప్ ద్వారా గ్యాస్ బుకింగ్.. చేసుకోండిలా..
థాంక్యూ సీఎం గారు.. జగన్ను అభినందించిన మెగా బ్రదర్..
కరోనాను జయించిన హెచ్ఐవీ పేషంట్..
కిమ్ మరీ ఇంత క్రూరుడా.. పారిపోవాలని చూసిన వాళ్లని చిత్రహింసలు పెట్టి..