సురక్షితంగా ఉండండి…అభిమానులకు చెర్రి ట్వీట్

కరోనా ప్రభావంతో దేశం మొత్తం లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. దీంతో చిత్ర పరిశ్రమ మొత్తం షూటింగ్‌లను నిలిపివేసింది. సినీ ప్రముఖులు ఇంటికే పరిమితమైపోయారు. కేవలం సోషల్ మీడియాలో కనిపిస్తూ.. ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేస్తున్నారు. ఇంట్లో కుటుంబ సభ్యులతో ఈ సమయాన్ని హాయిగా గడుపుతున్నారు. తాజాగా గతంలో హరిద్వార్‌లో దిగిన ఓ ఫొటోను రామ్ చరణ్ పోస్ట్ చేశారు. ఆ ఫోటోకు ఆసక్తికరమైన కామెంట్ కూడా జోడించారు. గతంలో హరిద్వార్‌లో తీసుకున్న ఫొటో ఇది. ప్రస్తుతం మనం పరిస్థితులకు […]

సురక్షితంగా ఉండండి...అభిమానులకు చెర్రి ట్వీట్

Updated on: Jun 11, 2020 | 10:00 PM

కరోనా ప్రభావంతో దేశం మొత్తం లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. దీంతో చిత్ర పరిశ్రమ మొత్తం షూటింగ్‌లను నిలిపివేసింది. సినీ ప్రముఖులు ఇంటికే పరిమితమైపోయారు. కేవలం సోషల్ మీడియాలో కనిపిస్తూ.. ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేస్తున్నారు. ఇంట్లో కుటుంబ సభ్యులతో ఈ సమయాన్ని హాయిగా గడుపుతున్నారు. తాజాగా గతంలో హరిద్వార్‌లో దిగిన ఓ ఫొటోను రామ్ చరణ్ పోస్ట్ చేశారు. ఆ ఫోటోకు ఆసక్తికరమైన కామెంట్ కూడా జోడించారు. గతంలో హరిద్వార్‌లో తీసుకున్న ఫొటో ఇది. ప్రస్తుతం మనం పరిస్థితులకు తగ్గట్టుగా మసలుకోవడమే. మళ్లీ పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని ఆశిస్తున్నాను. సురక్షితంగా ఉండండి అంటూ చెర్రీ ట్వీట్ చేశాడు.