AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బెంగుళూరుకు దొరబాబు.. స్పెషల్ హెలికాఫ్టర్‌లో ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజు రోజుకూ కరోనావైరస్ కేసులు పెరుగుతున్నాయి. సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు, రాజకీయ నాయకులను కూడా ఈ వైరస్ వదలడం లేదు.

బెంగుళూరుకు దొరబాబు.. స్పెషల్ హెలికాఫ్టర్‌లో ఎమ్మెల్యే
Jyothi Gadda
|

Updated on: Sep 06, 2020 | 5:14 PM

Share

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజు రోజుకూ కరోనావైరస్ కేసులు పెరుగుతున్నాయి. సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు, రాజకీయ నాయకులను కూడా ఈ వైరస్ వదలడం లేదు. ఏపీలో కరోనా కేసుల సంఖ్య 5 లక్షలకు చేరువలో ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రజా ప్రతినిధులకు కరోనా సోకింది. ఈ క్రమంలోనే తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం శాసన సభ్యుడు పెండెం దొరబాబుకు శనివారం రోజున కోవిడ్-19 పాజిటీవ్‌గా తేలింది. ఈ విషయాన్ని పిఠాపురం ప్రభుత్వ ఆస్పత్రి ఛీఫ్ మెడికల్ ఆఫిసర్ విజయ్ శేఖర్ వెల్లడించారు.

కాగా, ఆదివారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో దొరబాబును మెరుగైన వైద్య సేవల కోసం బెంగుళూరుకు తరలించారు. కాకినాడ నుంచి బెంగుళూరుకు ప్రత్యేక హెలికాప్టర్ లో తీసుకెళ్లారు. అక్కడ ఆయనకు కరోనావైరస్ నుంచి కోలుకోవడానికి మెరుగైన చికిత్స అందించనున్నారు.