కరోనా కట్టడికి రంగంలోకి దిగిన పారామిలటరీ బలగాలు..

దేశంలో మహారాష్ట్ర తర్వాత అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదైందని గుజరాత్‌లోనే. ఈ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. దీనితో మే 7 నుంచి మే 15 వరకు పూర్తిస్థాయి లాక్ డౌన్‌ను పాటించాలని నగర మున్సిపల్ కార్పోరేషన్ నిర్ణయించింది. అత్యవసర సేవలు మినహాయించి మొత్తం అన్నీ మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వాన్ని సాయం కోరగా.. ఐదు కంపెనీల పారామిలటరీ బలగాలు రంగంలోకి దిగాయి. అహ్మదాబాద్, సూరత్‌లలో ఉన్న […]

కరోనా కట్టడికి రంగంలోకి దిగిన పారామిలటరీ బలగాలు..

Updated on: May 08, 2020 | 2:00 PM

దేశంలో మహారాష్ట్ర తర్వాత అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదైందని గుజరాత్‌లోనే. ఈ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. దీనితో మే 7 నుంచి మే 15 వరకు పూర్తిస్థాయి లాక్ డౌన్‌ను పాటించాలని నగర మున్సిపల్ కార్పోరేషన్ నిర్ణయించింది. అత్యవసర సేవలు మినహాయించి మొత్తం అన్నీ మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వాన్ని సాయం కోరగా.. ఐదు కంపెనీల పారామిలటరీ బలగాలు రంగంలోకి దిగాయి.

అహ్మదాబాద్, సూరత్‌లలో ఉన్న కంటైన్మెంట్ జోన్లలో ఈ పారామిలటరీ బలగాలు విధులు నిర్వహిస్తాయని.. రాష్ట్ర సీఎం విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం వీళ్లను స్పెషల్ ఫ్లైట్‌లో పంపిందని గుజరాత్ డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ శివానంద్ ఝా తెలిపారు. అటు రాత్రిపూట కర్ఫ్యూ యధావిధిగా కొనసాగుతుందని.. కఠినమైన నిబంధనలు ప్రజలు ఈ వారం రోజులు ఖచ్చితంగా పాటించాలని ఆయన అన్నారు.

Read More:

మెట్రో సర్వీసుల్లో 50% ఆక్యుపెన్సీ.. సిటీ బస్సుల్లో నో స్టాండింగ్!

కిమ్ మరణం వెనుక అసలు రహస్యమిదే.. దేశద్రోహులు గుర్తింపు.. వారికి చావే గతి!

మందుబాబులకు కిక్కిచ్చే వార్త.. ఇకపై వాటికి చెక్ పడినట్లే!

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.. ఇంజనీరింగ్ ఫీజుల జీవో సస్పెండ్..

Loading...
Unable to load recommendations.
Follow Us