నేపాల్‌లో 3వేల మార్క్ దాటిన కరోనా..

| Edited By:

Jun 06, 2020 | 9:16 PM

మన పొరుగుద దేశం నేపాల్‌లో కూడా కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. గత కొద్ది రోజులుగా ఇక్కడ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.

నేపాల్‌లో 3వేల మార్క్ దాటిన కరోనా..
Follow us on

మన పొరుగుద దేశం నేపాల్‌లో కూడా కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. గత కొద్ది రోజులుగా ఇక్కడ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. గతంలో ఇక్కడ మొత్తం కేసులు వందల్లో మాత్రమే ఉండగా.. ఇప్పుడు రోజురోజు వందల్లో కేసులు నమోదవుతుండటంతో.. స్థానిక ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా శనివారం నాడు కొత్తగా మరో 323 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,235కి చేరింది. ఈ విషయాన్ని నేపాల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి ఇద్దరు మరణించగా.. 32 మంది కరోనా నుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. శనివారం నాడు నమోదైన కేసుల్లో 286 మంది పురుషులు ఉండగా..37 మంది మహిళలు ఉన్నారు. ఇక ఇప్పటి వరకు కరోనా సోకిన వారిలో..3,003 మంది పురుషులు ఉండగా,232 మంది మహిళలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇక ఇప్పటి వరకు కరోనా నుంచి కొలుకున్న వారి సంఖ్య 365 కాగా, అందులో 299 మంది పురుషులు,66 మంది మహిళలు ఉన్నారని తెలిపారు. ఇక ఇప్పటి వరకు కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 13కి చేరింది.