నేపాల్‌లో పెరుగుతున్న కరోనా కేసులు.. తాజా అప్డేట్స్‌ ఇవే..

| Edited By:

Jun 10, 2020 | 10:19 PM

పొరుగు దేశం నేపాల్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే నాలుగు వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా బుధవారం నాడు కొత్తగా మరో 279 కేసులు పాజిటివ్‌గా తేలాయి.

నేపాల్‌లో పెరుగుతున్న కరోనా కేసులు.. తాజా అప్డేట్స్‌ ఇవే..
Follow us on

పొరుగు దేశం నేపాల్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే నాలుగు వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా బుధవారం నాడు కొత్తగా మరో 279 కేసులు పాజిటివ్‌గా తేలాయి. దీంతో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా పాజటివ్ కేసుల సంఖ్య 4,364కి చేరింది. ఈ విషయాన్ని నేపాల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక బుధవారం నాడు నమోదైన కేసుల్లో 257 మంది పురుషులు ఉండగా, 22 మంది మహిళలు ఉన్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 4,055 పురుషులకు,309 మహిళలకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దేశ వ్యాప్తంగా 72 జిల్లాలకు కరోనా సోకిందని అధికారులు తెలిపారు. ఇక కరోనా మహమ్మారి నుంచి బుధవారం నాడు 90 కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని.. వీరిలో 88 పురుషులు ఉండగా.. ఇద్దరు మహిళలు ఉన్నట్లు తెలిపారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి 674 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. వీరిలో 595 మంది పురుషులు,79 మంది మహిళలు ఉన్నారు.