మంత్రి పీఏకు క‌రోనా ? హోంక్వారంటైన్‌లోకి హ‌రీశ్‌రావు !

తెలంగాణ‌లో క‌రోనా ఉధృతి కొన‌సాగుతోంది. సామాన్యుల నుంచి ఉన్న‌తాధికారులు, రాజ‌కీయ నాయ‌కులు అంద‌రినీ వైర‌స్ వ‌ణికిస్తోంది. ఇటీవ‌లే జీహెచ్ ఎంసీ మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ ద‌గ్గ‌ర డ్రైవ‌ర్‌గా ప‌నిచేసే వ్య‌క్తికి వైర‌స్ సోకింది. దీంతో మేయ‌ర్ స‌హా వారి కుటుంబ స‌భ్యులు, ఇత‌ర అధికారుల‌ను హోంక్వారంటైన్‌లో ఉంచారు. తాజాగా మంత్రి

మంత్రి పీఏకు క‌రోనా ? హోంక్వారంటైన్‌లోకి హ‌రీశ్‌రావు !

Updated on: Jun 12, 2020 | 4:32 PM

తెలంగాణ‌లో క‌రోనా ఉధృతి కొన‌సాగుతోంది. సామాన్యుల నుంచి ఉన్న‌తాధికారులు, రాజ‌కీయ నాయ‌కులు అంద‌రినీ వైర‌స్ వ‌ణికిస్తోంది. ఇటీవ‌లే జీహెచ్ ఎంసీ మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ ద‌గ్గ‌ర డ్రైవ‌ర్‌గా ప‌నిచేసే వ్య‌క్తికి వైర‌స్ సోకింది. దీంతో మేయ‌ర్ స‌హా వారి కుటుంబ స‌భ్యులు, ఇత‌ర అధికారుల‌ను హోంక్వారంటైన్‌లో ఉంచారు. తాజాగా మంత్రి హ‌రీశ్‌రావు పీఏకు కూడా క‌రోనా సోకిన‌ట్లు తెలుస్తోంది. దీంతో మంత్రి హ‌రీశ్ రావుతో పాటు కుటుంబ స‌భ్యులుహోం క్వారంటైన్‌లోకి వెళ్లిన‌ట్లు స‌మాచారం.  లాక్‌డౌన్ విధించినప్పటి నుంచి మంత్రి హరీశ్ రావు ప్రజలను క‌రోనా వైర‌స్ విషయమై చైతన్య వంతుల్ని చేస్తున్నారు. అందరికీ అర్థమయ్యే జాగ్రత్త చర్యలను వివరిస్తున్నారు. నిరంతరం జనంలో తిరుగుతూ వారికి అండగా నిలుస్తున్నారు.

మ‌రోవైపు, మరోవైపు సిద్ధిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామా రెడ్డి కూడా సెల్ఫ్ ఐసోలేషన్లోకి వెళ్లారు. ఇటీవల జడ్పీటీసీలు కలెక్టర్‌ను కలవగా.. వారి వెంటన వచ్చిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం అతడు హైదరాబాద్‌‌లో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలిసిన కలెక్టర్ కూడా సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్లారు. అటు, యాదాద్రి జడ్పీ సీఈవోకు కరోనా పాజిటివ్ అని తేలగా.. జూన్ 5న ఆయనతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ హోం క్వారంటైన్లోకి వెళ్లారు. సీఈవోతో కాంటాక్టులో ఉన్న అధికారులు, ఉద్యోగులంతా ఇంటి నుంచే పని చేస్తున్నారు.