“మహా”లో కరోనా విలయ తాండవం.. రికార్డు స్థాయిలో కేసులు..

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య వేలల్లో పెరుగుతోంది. దేశంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా మహరాష్ట్ర నుంచే నమోదవుతున్నాయి. తాజాగా ఆదివారం నాడు..

మహాలో కరోనా విలయ తాండవం.. రికార్డు స్థాయిలో కేసులు..

Edited By:

Updated on: Jul 19, 2020 | 11:03 PM

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య వేలల్లో పెరుగుతోంది. దేశంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా మహరాష్ట్ర నుంచే నమోదవుతున్నాయి. తాజాగా ఆదివారం నాడు కొత్తగా 9,518 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,10,455కి చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి 258 మంది మరణించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా బారినపడి 11,854 మంది మరణించారు. ఇక ఆదివారం నాడు కరోనా నుంచి కోలుకుని 3,906 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారన్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 1,69,569 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని మహరాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కాగా, రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా ముంబై మహానగరంలోనే నమోదవుతున్నాయి.