AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహారాష్ట్రలో పెరిగిన రికవరీలు.. ఒక్కరోజే 10 వేలకు పైగా..

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య వేలల్లో నమోదవుతున్నాయి. అయితే గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య పెరిగింది. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి..

మహారాష్ట్రలో పెరిగిన రికవరీలు.. ఒక్కరోజే 10 వేలకు పైగా..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 28, 2020 | 9:02 PM

Share

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య వేలల్లో నమోదవుతున్నాయి. అయితే గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య పెరిగింది. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 10,333 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 7,717 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,91,440కి చేరింది. ఇక కరోనా నుంచి కోలుకుని ఇప్పటి వరకు 2,32,277 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.44 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారినపడి 14 వేల మంది మరణించారు. ఇక రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా ఇప్పటి వరకు ముంబై నగరంలో నమోదయ్యేవి. అయితే అనూహ్యంగా ముంబై నగరంలో కరోనా టెస్టులు పెంచడంతో.. క్రమక్రమంగా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో ముంబై నగరంలో ఏడు వందల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ముంబై నగర వాసులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.