షాకింగ్: కరెంట్ బిల్ రూ.లక్ష దాటితే ఇక ఐటీ రిటర్న్ మస్ట్..

| Edited By:

May 31, 2020 | 8:07 PM

కరెంట్ బిల్లు లక్ష రూపాయలు దాటితే తప్పనిసరిగా ఐటీ రిటర్న్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది ఆదాయపన్ను శాఖ. కరెంట్ అకౌంట్ డిపాజిట్లు రూ.కోటి దాటినా రిటర్న్ దాఖలు చేయడాన్ని తప్పని సరి చేసింది. 2019-2020 ఆర్థిక సంవత్సర ఆదాయ పన్ను రిటర్న్‌కు...

షాకింగ్: కరెంట్ బిల్ రూ.లక్ష దాటితే ఇక ఐటీ రిటర్న్ మస్ట్..
Follow us on

కరెంట్ బిల్లు లక్ష రూపాయలు దాటితే తప్పనిసరిగా ఐటీ రిటర్న్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది ఆదాయపన్ను శాఖ. కరెంట్ అకౌంట్ డిపాజిట్లు రూ.కోటి దాటినా రిటర్న్ దాఖలు చేయడాన్ని తప్పని సరి చేసింది. 2019-2020 ఆర్థిక సంవత్సర ఆదాయ పన్ను రిటర్న్‌కు ఫారాలను నోటిఫై చేసింది. కరోనా వైరస్ కారణంగా కేంద్రం ఇచ్చిన వెసులుబాట్లు, ప్రయోజనాలను పన్ను చెల్లింపుదారులకు అందించేందుకు ఐటీ ఫారాల్లో మార్పులు చేశారు. ఐటీ యాక్ట్ 1961లోని వేర్వేరు కాల పరిమితులను పొడిగించింది కేంద్రం.

ప్రత్యేక ఆర్డినెన్స్ 2020 ద్వారా ఈ మార్పులు చేసింది. దీని ప్రకారం చాప్టర్-వీఐఏ-బీ ద్వారా పెట్టుబడులు, ఇతర చెల్లిపులు, సెక్షన్ 80 సీ (ఎల్‌ఐసీ, పీపీఎఫ్, ఎన్ఎన్‌సీ), 80 డీ (మెడిక్లెయిమ్), 80జీ (విరాళాలు) ప్రయోజనాలు పొందేందుకు 2020 జూన్ 30 వరకు గడువు పొడిగించింది.

ఐటీ రిటర్న్ ఫారాల్లోని కీలక మార్పులు ఇవే:

– కరెంట్ ఖాతాలో డిపాజిట్లు కోటి రూపాయలు దాటితే వివరాలు ఖచ్చితంగా తెలపాలి
– కరెంట్ బిల్లు లక్ష రూపాయలు దాటితే రిటర్న్ దాఖలు చేయాలి
– విదేశీ ప్రయాణాల ఖర్చు రూ.2 లక్షలు దాటితే వివరాలు తెలియజేయాలి
– పన్ను ఆదా పెట్టుబడులు, విరాళాలకు సంబందంచిన వివరాలను 2019-20, 2020 జూన్‌కు గానూ వేర్వేరుగా సమర్పించాలి

కాగా ఐటీఆర్-1, ఐటీఆర్-2, ఐటీఆర్-4ల ప్రయోజనం ఒక సంస్థలో లేదా, జాబితాలో లేని ఈక్విటీ షేర్లలో పెట్టుబడులు పెట్టిన వ్యక్తులు పొందలేరని నంగియా అండర్సన్ కన్సల్టింగ్ డైరెక్టర్ శైలేష్ కుమార్ తెలిపారు. పన్ను చెల్లింపుదారులు ఏ ఫారం ఎంచుకోవాలనే విషయంపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ఇది కూడా చదవండి:

జూన్ 3న తెలంగాణలో ఇంటర్ పరీక్షలు..

రైతులకు కేంద్రం అందించే బంపర్ ఆఫర్.. చివరి తేదీ ఇదే!

బిగ్ బ్రేకింగ్: జూన్‌ 30 వరకూ లాక్‌డౌన్ పొడిగించిన తెలంగాణ సర్కార్