India Covid-19: దేశంలో 4 లక్షలు దాటిన కరోనా మరణాల సంఖ్య.. తగ్గుతున్న కేసుల ఉధృతి..

India Coronavirus cases: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. క్రమంగా కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. గ‌డిచిన 24 గంట‌ల వ్యవధిలో

India Covid-19: దేశంలో 4 లక్షలు దాటిన కరోనా మరణాల సంఖ్య.. తగ్గుతున్న కేసుల ఉధృతి..
Coronavirus Updates

Updated on: Jul 02, 2021 | 10:07 AM

India Coronavirus cases: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. క్రమంగా కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. గ‌డిచిన 24 గంట‌ల వ్యవధిలో (గురువారం) కొత్తగా 46,617 మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా నిన్న 853 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 3,04,58,251 కు పెరగగా.. మరణాల సంఖ్య 4,00,312 కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ శుక్రవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.

ఇదిలాఉంటే.. గురువారం క‌రోనా నుంచి 59,384 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకూ కోలుకున్న వారి సంఖ్య 2,95,48,302 కి పెరగింది. ప్రస్తుతం దేశంలో 5,09,637 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దేశంలో యాక్టివ్ కేసుల శాతం 1.67 శాతానికి తగ్గగా.. రికవరీ రేటు 97.01 శాతానికి పెరిగినట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.

కాగా.. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 34,00,76,232 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. నిన్న దేశవ్యాప్తంగా 18,80,026 కరోనా నిర్థారణ పరీక్షలు చేశారు. వీటితో కలిపి దేశంలో 41,42,51,520 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వెల్లడించింది.

Also Read:

Water Project Security: రోజు రోజుకు ముదురుతున్న జలవివాదం.. పోలీసు పహారాలోకి ప్రాజెక్టులు..

UAE Ban Travel :14 దేశాలకు ప్రయాణ నిషేధం విధించిన యూఏఈ..! భారత్, పాకిస్తాన్‌ తో సహా ఈ దేశాలకు వెళ్లలేరు..

Follow Us