Coronavirus India: దేశంలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు, మరణాలు.. తాజాగా ఎన్ని నమోదయ్యాయంటే..?

|

Feb 09, 2021 | 12:00 PM

India Coronavirus updates: దేశంలో కరోనావైరస్ వ్యాప్తి రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. ఉపశమనం కలిగించే విషయం ఎంటంటే.. సోమవారం పది వేలకు దిగువన కేసులు..

Coronavirus India: దేశంలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు, మరణాలు.. తాజాగా ఎన్ని నమోదయ్యాయంటే..?
Follow us on

India Coronavirus updates: దేశంలో కరోనావైరస్ వ్యాప్తి రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. ఉపశమనం కలిగించే విషయం ఎంటంటే.. సోమవారం పది వేలకు దిగువన కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా గత 24గంటల్లో 9,110 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ వైరస్ కారణంగా 78 మంది మరణించారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,08,47,304కి చేరగా.. మరణాల సంఖ్య 1,55,158 కి పెరిగింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ మంగళవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.

కాగా.. నిన్న కరోనా నుంచి 14,016 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు 1,05,48,521 మంది బాధితులు ఈ మహమ్మారి నుంచి కోలుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 1,43,625 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 97.25 శాతానికి చేరగా.. మరణాల రేటు 1.43 శాతంగా ఉంది.

ఇదిలాఉంటే.. భారత్‌లో కరోనావైరస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా వేగవంతంగా కొనసాగుతోంది. సోమవారం వరకు దేశవ్యాప్తంగా 62,59,008 మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చినట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది.

Also Read:

AP Panchayat Elections 2021 live: రసవత్తరంగా పంచాయతీ ఎన్నికల ‘తొలి’ పోరు.. ఓటు వేసేందుకు పోటెత్తిన జనం..

Twitter: రైతు ఆందోళనలపై తప్పుడు ప్రచారాలు.. కేంద్రం నోటీసులపై స్పందించిన ట్విట్టర్..