పెరుగుతున్న కరోనా కేసులతో ఇండియా విలవిల

| Edited By: Pardhasaradhi Peri

May 31, 2020 | 8:10 PM

కరోనా వైరస్ కేసుల్లో భారత్ జర్మనీని దాటేసింది. తాజాగా 1.85 లక్షల కేసులు నమోదయ్యాయని తెలుస్తోంది. (జర్మనీ లో 1.83 కేసులు నమోదయ్యాయి). ఆ దివారం నాటికి  1,85,398 కేసులతో ఇండియా.. ఈ కేసులకు సంబంధించి టాప్ మోస్ట్ లో ఉన్న పది దేశాల్లోకెల్లా తొమ్మిదో స్థానానికి ఎగబాకింది. నిన్న మొన్నటి వరకు ఎనిమిదో స్థానంలో ఉన్నట్టు లెక్కలు పేర్కొన్నాయి. గత ఇరవై నాలుగు గంటల్లో కొత్తగా 8,380 మందికి కరోనా వైరస్ సోకింది. ఈ 24 […]

పెరుగుతున్న కరోనా కేసులతో ఇండియా విలవిల
Follow us on

కరోనా వైరస్ కేసుల్లో భారత్ జర్మనీని దాటేసింది. తాజాగా 1.85 లక్షల కేసులు నమోదయ్యాయని తెలుస్తోంది. (జర్మనీ లో 1.83 కేసులు నమోదయ్యాయి). ఆ దివారం నాటికి  1,85,398 కేసులతో ఇండియా.. ఈ కేసులకు సంబంధించి టాప్ మోస్ట్ లో ఉన్న పది దేశాల్లోకెల్లా తొమ్మిదో స్థానానికి ఎగబాకింది. నిన్న మొన్నటి వరకు ఎనిమిదో స్థానంలో ఉన్నట్టు లెక్కలు పేర్కొన్నాయి. గత ఇరవై నాలుగు గంటల్లో కొత్తగా 8,380 మందికి కరోనా వైరస్ సోకింది. ఈ 24 గంటల్లో 193 మంది రోగులు మరణించగా.. ఇప్పటివరకు మొత్తం మృతుల సంఖ్య ఐదువేలకు మించినట్టు తాజా డేటా వెల్లడించింది. గత మూడు రోజులుగా కరోనా కేసులు పెరుగుతూనే వస్తున్నాయి.