Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇండియాలో పెరిగిపోతున్న కరోనా వైరస్ కేసులు.. సైలెంట్ అయిన కేంద్రం !

దేశంలో రోజురోజుకీ కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. ఏప్రిల్ 21 నాటికి ఈ దేశంలో ఇవి 18,985 మాత్రమే ఉండగా.. మే 20 నాటికి లక్షా ఆరువేల 750 కేసులకు పెరిగాయి. ఇలా లక్షకు పైగా కేసులు దాటిపోతున్నప్పటికీ కేంద్రం చడీ చప్పుడు చేయడంలేదు. మెల్లగా గ్లోబల్ సినేరియోలో ఇండియా కూడా కోవిడ్-19 హాట్ స్పాట్ గా మారుతోంది. ఈ నెల 7 నుంచి ప్రతి రోజూ సుమారు 3,200 కేసులు నమోదవుతూ వచ్చాయి. 11 వ […]

ఇండియాలో పెరిగిపోతున్న కరోనా వైరస్ కేసులు.. సైలెంట్ అయిన కేంద్రం !
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 20, 2020 | 4:39 PM

దేశంలో రోజురోజుకీ కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. ఏప్రిల్ 21 నాటికి ఈ దేశంలో ఇవి 18,985 మాత్రమే ఉండగా.. మే 20 నాటికి లక్షా ఆరువేల 750 కేసులకు పెరిగాయి. ఇలా లక్షకు పైగా కేసులు దాటిపోతున్నప్పటికీ కేంద్రం చడీ చప్పుడు చేయడంలేదు. మెల్లగా గ్లోబల్ సినేరియోలో ఇండియా కూడా కోవిడ్-19 హాట్ స్పాట్ గా మారుతోంది. ఈ నెల 7 నుంచి ప్రతి రోజూ సుమారు 3,200 కేసులు నమోదవుతూ వచ్చాయి. 11 వ తేదీ నుంచి ఇది సుమారు మూడున్నర వేలకు పెరగగా, గత నాలుగు రోజుల్లో (మే 17 నుంచి 20 వరకు) రోజుకు 4,950 కేసులకు పెరిగింది. ఇక ఒక్క బుధవారం రోజే కొత్తగా 5,611 కేసులు నమోదయ్యాయి. ఇంత ‘విలయం’ ఏర్పడుతున్నా.. ఈ పరిస్థితిని ఎలా అధిగమిద్దామని గానీ, కరోనాను ఎలా కట్టడి చేద్దామని గానీ కేంద్రం నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. గతంలో రోజూ ప్రెస్ బ్రీఫింగులు నిర్వహించే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ.. గత 8రోజులుగా వీటికి స్వస్తి చెప్పినట్టు కనిపిస్తోంది. చివరిసారి ఈ నెల 11 న హెల్త్ మినిస్ట్రీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది. మీడియాతో ఇంటరాక్షన్ ని ఎందుకు విరమించుకుందో అర్థం కాని పరిస్థితి అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లాక్ డౌన్  మాట క్రమేపీ పాతబడిపోతోంది.. బహుశా ఇక  కరోనా వైరస్ తో ‘సహజీవనం’ చేయాలన్న నేతల వ్యాఖ్యలు ఈ శాఖకి ‘రుచించినట్టు’ ఉన్నాయేమో !

,