ఏప్రిల్ 14 వరకు పాలు, కూరగాయలు ఉచితం

|

Apr 02, 2020 | 1:40 PM

ప్ర‌జ‌లు నిత్య‌వ‌స‌ర స‌రుకుల కోసం ఇబ్బందులు ప‌డ‌కుండా ఉండేందుకు ప్ర‌భుత్వాలు ప‌క‌డ్బంది ఏర్పాట్లు చేశాయి. ఈ క్ర‌మంలో అక్క‌డి ముఖ్య‌మంత్రి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ..

ఏప్రిల్ 14 వరకు పాలు, కూరగాయలు ఉచితం
Follow us on
దేశంలో క‌రోనా క‌రాళ‌నృత్యం చేస్తోంది. వైర‌స్ వ్యాప్తిని క‌ట్ట‌డి చేసేందుకు కేంద్రం లాక్‌డౌన్ ప్ర‌క‌టించింది. దీంతో అన్ని దుకాణాలు, మార్కెట్లు, వ్యాపార స‌ముదాయాలు మూత‌ప‌డ్డాయి. ప్ర‌జ‌లు నిత్య‌వ‌స‌ర స‌రుకుల కోసం ఇబ్బందులు ప‌డ‌కుండా ఉండేందుకు ప్ర‌భుత్వాలు ప‌క‌డ్బంది ఏర్పాట్లు చేశాయి. ఈ క్ర‌మంలో అక్క‌డి ముఖ్య‌మంత్రి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.
బంద్‌ కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు నిరంతరాయంగా నిత్య‌వ‌స‌ర స‌రుకులు, కూర‌గాయ‌లు,పాలు, సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లుగా ప్ర‌క‌టించారు కర్నాటక సీఎం యడియూరప్. ట్రాన్స్ పోర్టు లేక రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి సాధ్యం కావట్లేదని, హాప్ కామ్స్ ద్వారా కొనుగోలు చేసి సరఫరా చేస్తామని చెప్పారు. రాష్ట్రంలోని పేదలకు ఈ నెల 14 వరకు ఉచితంగా పాలు పంపిణీ చేస్తామన్నారు. అన్ని జిల్లాల కలెకర్ట్లకు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల‌తో పాటుగా కోడిగుడ్లను కూడా హాప్ కామ్స్ ద్వారా అమ్ముతామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా బియ్యం, ప‌ప్పు మిల్లులను తెరిచేందుకు నిర్ణయం తీసుకున్నట్లుగా సీఎం ప్ర‌క‌టించారు.